News March 19, 2024
ఆరోజు రాత్రి గంటపాటు లైట్లు ఆర్పండి

ఈనెల 23న దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహించనున్నారు. ఆరోజు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఎర్త్ అవర్లో భాగంగా గంటపాటు అందరూ లైట్లు ఆఫ్ చేయాలని పర్యావరణ శాఖ కోరింది. వాతావరణంలో మార్పులు, జీవవైవిధ్యానికి జరుగుతున్న నష్టాన్ని కొంతైనా తగ్గించేందుకు ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. కాగా ఏటా ఒకసారి దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నారు.
Similar News
News October 17, 2025
జగన్పై దుమ్మెత్తడానికి మాత్రం పవన్ ఊపుకుంటూ వస్తాడు: పేర్ని నాని

కల్తీ మద్యంతో అడ్డగోలు దోపిడీ జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని వైసీపీ నేత పేర్ని నాని ప్రశ్నించారు. ‘ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా నిద్రపోతున్నారా? గతంలో జగన్ మద్యపాన ప్రియుల కడుపు కొట్టాడని ఊగిపోయిన పవన్ ఇపుడు నోరెత్తే ధైర్యం చేయడం లేదు. అబద్ధాలను జగన్కు అంటించడానికి మాత్రం ఊపుకుంటూ వస్తాడు’ అని ఎద్దేవా చేశారు. కల్తీ పాపాన్ని YCPకి అంటించే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
News October 17, 2025
నారదుడు సినిమాల్లో చూపించినట్లే ఉంటాడా?

నారద మహర్షిని సినిమాల్లో అనవసర తగువులు పెట్టే పాత్రగా చూపిస్తారు. కానీ నారదుడు నారాయణుడికి పరమ భక్తుడు. నిస్వార్థపరుడు. అపర బుద్ధిమంతుడు. ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు రచించిన వేదవ్యాసుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, వాల్మీకి వంటి గొప్ప వారికి గురువు ఆయన. నారద మహర్షి లోక కళ్యాణం, దైవ జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం ముల్లోకాలు సంచరించేవారు. ☞ ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ.
News October 17, 2025
ఉచిత ఇసుక అందరికీ అందాల్సిందే: CBN ఆదేశం

AP: ఉచిత ఇసుక ప్రజలందరికీ అందేలా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని CBN ఆదేశించారు. అక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, తనిఖీలు విస్తృతం చేయాలని సూచించారు. ‘ఇసుక లోడింగ్, రవాణాకు తక్కువ ఖర్చయ్యేలా చూడండి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో సీసీ కెమెరాల నిఘా పెంచండి’ అని సూచించారు. ఈ సీజన్లో 65లక్షల టన్నుల ఇసుక నిల్వ చేశామని, స్టాక్ పాయింట్లలో 43లక్షల టన్నులు సిద్ధంగా ఉందని అధికారులు వివరించారు.