News December 9, 2024
ట్విస్ట్.. ఇద్దరు మంత్రులకు ఒకే నంబర్ నుంచి బెదిరింపులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733754854292_1226-normal-WIFI.webp)
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు <<14834003>>హత్య బెదిరింపులు<<>> రావడంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. తనకు రెండు రోజుల క్రితం బెదిరింపులు వచ్చిన నంబర్ నుంచే ఈ కాల్ వచ్చినట్లు హోంమంత్రి గుర్తించారు. దీంతో ఆగంతకుడిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆమె ఆదేశించారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బందర్ రోడ్డు నుంచి మల్లిఖార్జున రావు అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.
Similar News
News January 19, 2025
ట్రంప్తో ముకేశ్- నీతా అంబానీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737289801628_746-normal-WIFI.webp)
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రేపు ప్రమాణం చేయనున్నారు. ఈ వేడుకకు వివిధ దేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే, దీనికి ముందే ట్రంప్ ఏర్పాటు చేసిన ‘క్యాండిల్ లైట్ డిన్నర్’కు భారత కుబేరుడు ముకేశ్ అంబానీ తన భార్య నీతా అంబానీతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్తో వీరు దిగిన ఫొటో వైరలవుతోంది. కాగా, ప్రమాణస్వీకారోత్సవం తర్వాత మార్క్ జుకర్బర్గ్ ఇచ్చే డిన్నర్లోనూ వీరు పాల్గొననున్నారు.
News January 19, 2025
‘పరీక్షా పే చర్చ’కు భారీగా అప్లికేషన్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737288531386_653-normal-WIFI.webp)
ప్రధాని మోదీ నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి 3.5 కోట్లకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షల సందర్భంగా ఒత్తిడికి గురి కాకుండా ఉండటంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మోదీ చర్చిస్తారు. కాగా పరీక్షా పే చర్చా ఎడిషన్-8 నిర్వహణ తేదీ ఇంకా ప్రకటించలేదు.
News January 19, 2025
చరిత్ర సృష్టించిన ‘పుష్ప-2’!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737284871749_746-normal-WIFI.webp)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం రీలోడెడ్ వెర్షన్ విడుదలవగా చాలా చోట్ల హౌస్ ఫుల్గా నడుస్తోంది. దీంతో రిలీజైన 45వ రోజున కూడా ఓ సినిమాకు హౌస్ ఫుల్ పడటం ఇదే తొలిసారి అని సినీవర్గాలు పేర్కొన్నాయి. 20+నిమిషాలు యాడ్ అవడం సినిమాకు ప్లస్ అయినట్లు తెలిపాయి. ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.