News April 29, 2024

వడదెబ్బకు ఇద్దరు మృతి.. ఇవాళ, రేపు ఎండలు మరింత తీవ్రం

image

TG: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. నిన్న ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో వడదెబ్బతో ఇద్దరు మరణించారు. మరోవైపు ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో వర్షం పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.

Similar News

News November 16, 2025

లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

image

☛ రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా రిలీజ్ డేట్‌లో మార్పు.. ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే (NOV 27) థియేటర్లలోకి సినిమా.. ఈ నెల 18న ట్రైలర్
☛ నాగార్జున ‘శివ’ రీరిలీజ్‌కు 2 రోజుల్లో ₹3.95Cr గ్రాస్ కలెక్షన్స్
☛ నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకుడిగా త్వరలో సినిమా: సినీ వర్గాలు
☛ ధనుష్ డైరెక్షన్‌లో రజినీ హీరోగా సినిమా తెరకెక్కే అవకాశం: తమిళ సినీ వర్గాలు

News November 16, 2025

భారీ IPOలకు సూపర్ స్పందన

image

ఈ ఏడాది భారీ IPOలపై మదుపర్లు ఆసక్తి కనబరిచారు. ₹5,000Crకు పైగా విలువ ఉన్న IPOలకు సగటున 17.7 రెట్ల అధిక స్పందన లభించింది. 2021 తర్వాత ఇదే అత్యధికం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 84 IPOలు ₹1.29L Cr సమీకరించగా, అందులో ఆరు సంస్థలు ₹62,000Cr దక్కించుకున్నాయి. వీటిలో LG ఎలక్ట్రానిక్స్‌(38.17 రెట్లు), లెన్స్‌కార్ట్‌(28.35రెట్లు), గ్రో(17.6రెట్లు), హెక్జావేర్‌ (2.27రెట్లు), టాటా క్యాపిటల్‌ (1.96రెట్లు) ఉన్నాయి.

News November 16, 2025

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.