News April 29, 2024

వడదెబ్బకు ఇద్దరు మృతి.. ఇవాళ, రేపు ఎండలు మరింత తీవ్రం

image

TG: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. నిన్న ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో వడదెబ్బతో ఇద్దరు మరణించారు. మరోవైపు ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో వర్షం పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.

Similar News

News December 1, 2025

తెలంగాణ అప్‌డేట్స్

image

*రైతు భరోసా ఇవ్వకుండా కౌలు రైతులను ప్రభుత్వం మోసగించిందని BRS నేత హరీశ్ విమర్శించారు.
* టెట్ దరఖాస్తులలో వివరాల సవరణ గడువు నేటితో ముగియనుంది. పేరు, ఆధార్​, ఫోన్​ నంబర్​, అర్హతలు, సెంటర్లు మార్పు చేసుకోవచ్చు.
* కరెంటు సహా ఇతర బిల్లుల ఆధారంగా ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ ఇచ్చేందుకు ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB)’ను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ స్కోరుతో బ్యాంకులు SHG సభ్యులకు లోన్లు ఇస్తాయి.

News December 1, 2025

హైదరాబాద్‌లో 45 పోస్టులకు నోటిఫికేషన్

image

HYD సనత్‌నగర్‌లోని <>ESIC<<>> సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో 45 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టును బట్టి MD/MS, DM/M.CH ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 10, 11,12, 15, 16 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. జీతం నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,56,671, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,70,681, Asst. ప్రొఫెసర్‌కు రూ.1,46,638, సీనియర్ రెసిడెంట్‌కు రూ.67,700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: esic.gov.in

News December 1, 2025

మాయదారి మహమ్మారికి ఆరేళ్లు..!

image

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ‘కరోనా’ మహమ్మారిని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. చైనా వుహాన్‌లో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఆరేళ్లు. 2019లో మొదలైన ఈ మహమ్మారి అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని చుట్టుముట్టింది. 70లక్షల మంది ప్రాణాలను హరించి, కోట్లాది మందిని రోడ్డున పడేసింది. భారీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న మానవాళి.. టీకాలు, ఆరోగ్య నియమాలతో పోరాడి గెలిచింది. కరోనా మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది?