News August 22, 2024

ఏపీ హైకోర్టుకు మరో ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు

image

AP: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. వీరు రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జస్టిస్ జోతిర్మయి(తెనాలి) 2008లో జిల్లా జడ్జిగా ఎంపికై అంచెలంచెలుగా ఎదిగారు. జస్టిస్ గోపాలకృష్ణారావు(కృష్ణా-D చల్లపల్లి) 1994 నుంచి పలు హోదాల్లో పనిచేస్తూ హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.

Similar News

News February 1, 2026

పోలవరం ఎత్తు తగ్గింపుతో తీరని నష్టం: బుగ్గన

image

AP: పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిస్తున్నట్లు కేంద్రం పదేపదే చెబుతున్నా రాష్ట్రం తలూపుతూ ఊరుకోవడం సరికాదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. దీనివల్ల భవిష్యత్తులో నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి ఎత్తు 45.72M అన్నారు. కాగా బడ్జెట్ నిరాశపర్చిందని YCP MP అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. పోలవరానికి ₹3వేల కోట్లే ఇచ్చారని, ఇలా అయితే అది ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు.

News February 1, 2026

బంగ్లాదేశ్‌కు ఇండియా ‘బడ్జెట్’ షాక్!

image

బడ్జెట్ 2026-27లో బంగ్లాదేశ్‌కు ఇండియా ఇచ్చే ఫండ్స్‌లో భారీగా కోత పెట్టింది. గతేడాది ₹120 కోట్లు కేటాయించగా ఈసారి దాన్ని సగానికి తగ్గించి ₹60 కోట్లు మాత్రమే ఇచ్చింది. బంగ్లాలో మైనారిటీలపై దాడులు పెరగడం, అక్కడి ప్రభుత్వం పాక్‌తో దోస్తీకి యత్నించడం వంటి కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్ ప్రాజెక్టుకు కూడా ఇండియా నిధులు కేటాయించలేదు.

News February 1, 2026

కరివేపాకు మొక్కలు గుబురుగా పెరగాలంటే?

image

కరివేపాకు మొక్కలు ఒక మీటరు ఎత్తు పెరిగాక మొక్క చివర్లను తుంచాలి. ఇలా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మొక్కలు గుబురుగా పెరుగుతాయి. మూడేళ్లు వచ్చిన కరివేపాకు చిన్న కొమ్మలను మొక్క మొదలు వరకు తుంచి, 4 లేదా 5 శాఖలు ఉండేలా ఉంచితే ఎక్కువ దిగుబడి వచ్చి ఆదాయం పెరుగుతుంది. అలాగే పంట కోసిన తర్వాత ప్రతిసారీ 50 కిలోల నత్రజని, 50 కిలోల పొటాష్ అందించే ఎరువులను మొక్కలకు వేస్తూ ఉండాలి.