News January 31, 2025
సరిహద్దులో ఎదురుకాల్పులు.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

J&Kలో పెద్దఎత్తున చొరబాట్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. పూంఛ్ సెక్టార్లోని సరిహద్దు నియంత్రణ రేఖ నుంచి మన దేశంలోకి చొరబడేందుకు నిన్న రాత్రి టెర్రరిస్టులు కుట్ర పన్నారు. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు కాల్పులు ప్రారంభించాయి. రాత్రంతా భారీ స్థాయిలో ఎదురుకాల్పులు కొనసాగాయి. ఇందులో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. పెద్దఎత్తున ఆయుధాలు సీజ్ చేశారు.
Similar News
News November 1, 2025
టీమ్ఇండియా కప్ గెలిస్తే రూ.125కోట్లు!

WWC గెలిస్తే భారత క్రికెట్ జట్టుకు భారీ నజరానా ఇవ్వాలని BCCI భావిస్తున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. గతేడాది T20 WC గెలిచిన పురుషుల జట్టుకు రూ.125కోట్ల ప్రైజ్మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. మెన్స్ టీంతో సమానంగా మహిళల జట్టుకు కూడా నజరానా అందించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. రేపు ఫైనల్లో నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో హర్మన్ సేన పోటీపడనుంది. అటు ICC సుమారు రూ.123CR ప్రైజ్మనీ ఇస్తుంది.
News November 1, 2025
‘నా డెత్ సర్టిఫికెట్ పోయింది’ అంటూ యాడ్!

పాన్ కార్డు, బర్త్, స్టడీ సర్టిఫికెట్స్ పోయాయని కొందరు పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటాం. అయితే అస్సాంలోని ఓ వార్తాపత్రికలో తన డెత్ సర్టిఫికెట్ పోయిందని యాడ్ రావడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. రంజిత్ చక్రవర్తి అనే వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ లంబ్డింగ్ బజార్లో పోయిందని ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు దీనిపై స్పందించకపోయినా, ఈ తప్పు ప్రకటన ఇంటర్నెట్లో పెద్ద చర్చకు దారితీసింది.
News November 1, 2025
వరి పొలం గట్లపై కంది మొక్కల పెంపకంతో ఏమిటి లాభం?

AP: కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి సాగు చేస్తున్న పొలాల గట్లపై రైతులు కందిని సాగు చేస్తున్నారు. దీని వల్ల కంది పంట పొలం తయారీకి, పురుగు మందుల కోసం చేసే ఖర్చు ఉండదు. వరికి పెట్టే నీటినే కంది మొక్కలు పీల్చుకొని పెరుగుతాయి. వరి పూత దశలో ఆశించే పురుగులను కంది ఆకర్షించి ఎర పైరుగా పని చేస్తుంది. రైతులకు రెండు పంటల దిగుబడి వస్తుంది. ఇలా పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై కంది విత్తనాలను అందిస్తోంది.


