News November 17, 2024

మాజీ సీజేఐ చంద్రచూడ్‌పై ఉద్ధ‌వ్ ఠాక్రే ఫైర్

image

ఇటీవ‌ల సీజేఐగా ప‌ద‌వీ విరమ‌ణ చేసిన జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ శివ‌సేన ఎమ్మెల్యేల అన‌ర్హ‌త కేసులో తీర్పు చెప్ప‌క‌పోవ‌డంపై నిరాశ చెందిన‌ట్టు ఉద్ధ‌వ్ ఠాక్రే పేర్కొన్నారు. న్యాయాన్ని వెల్ల‌డించ‌కుండా చంద్ర‌చూడ్ కేవ‌లం కామెంటేట‌ర్‌గా మిగిలిపోయార‌ని దుయ్య‌బ‌ట్టారు. జ‌డ్జిగా కాకుండా న్యాయ విద్య‌ లెక్చ‌ర‌ర్‌గా చంద్ర‌చూడ్ ప‌ని చేసి వుంటే మ‌రింత పేరు సంపాదించేవార‌ని వ్యంగ్యంగా విమ‌ర్శించారు.

Similar News

News April 18, 2026

విజయ్ చేతిలో శునకాలు.. ఆసక్తికరంగా కొత్త సినిమా పోస్టర్

image

హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్‌తో చేయనున్నట్లు ప్రకటించారు. దర్శకుడి ఊహాశక్తికి తగ్గట్టుగా ఈ మూవీ కోసం తన సర్వస్వాన్ని అందిస్తానని విజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అలెజాండ్రో మార్టినెజ్(DOP), హేశమ్ అబ్దుల్ వాహెబ్(మ్యూజిక్), ఎరిక్ డర్స్ట్(VFX)ను పరిచయం చేశారు. హీరో శునకాలను, డైరెక్టర్ గుర్రాన్ని పట్టుకున్నట్లుగా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.

News April 18, 2026

గూగుల్, మెటాకు భారతీరెడ్డి లీగల్ నోటీసులు

image

గూగుల్, మెటా, X, యూట్యూబ్‌కు వైఎస్ జగన్ సతీమణి భారతీ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. సోషల్ మీడియాలో తనపై చేసిన తప్పుడు పోస్టులు, పరువుకు నష్టం కలిగించే పోస్టులను తొలగించాలని నోటీసులు ఇచ్చారు. కావాలనే తనను టార్గెట్ చేస్తూ పోస్టులు చేశారని పేర్కొన్నారు. తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్న అకౌంట్లను తొలగించాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. థింక్ ఆంధ్ర, M9 న్యూస్ సంస్థలకూ నోటీసులు పంపారు.

News April 18, 2026

రోహిత్, కోహ్లీ రికార్డ్ బద్దలుకొట్టిన స్మృతి మంధాన

image

ఉమెన్స్ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన రికార్డ్ సృష్టించారు. T20Iల్లో(మెన్స్&ఉమెన్స్) అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచారు. స్మృతి 155 ఇన్నింగ్స్‌లో 4,244 రన్స్ చేసి రోహిత్(4,231), కోహ్లీ(4,188)ని వెనక్కి నెట్టారు. రోహిత్ 154, కోహ్లీ 117 ఇన్నింగ్సుల్లో ఈ పరుగులు చేశారు. నిన్న SAతో జరిగిన తొలి T20లో స్మృతి 13 రన్స్ కొట్టి ఈ ఫీట్ సాధించారు. అయితే ఈ మ్యాచులో IND 6 వికెట్ల తేడాతో ఓడింది.