News June 21, 2024
UGC-NET పేపర్ లీక్.. ఎఫ్ఐఆర్ నమోదు

యూజీసీ నెట్ పేపర్ లీకేజీ కేసులో కేంద్ర విద్యాశాఖ సూచనలతో గుర్తు తెలియని వ్యక్తులపై CBI ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ నెల 18న యూజీసీ నెట్ నిర్వహించగా మరుసటి రోజే పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయనే జాతీయ సైబర్ నేర హెచ్చరికల విశ్లేషణ నివేదికతో అవకతవకలకు ప్రాథమిక ఆధారాలున్నాయని యూజీసీ నిర్ధారించింది. త్వరలోనే ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
Similar News
News December 11, 2025
గురుకుల స్కూళ్ల ప్రవేశాలకు నోటిఫికేషన్

TG: SC, ST, BC, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2026-27లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో 5, 6, 9వ తరగతుల్లో చేరికలకు 2026 FEB 22న ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు అన్ని జిల్లాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందని ప్రకటించింది. అభ్యర్థులు ఆన్లైన్లో JAN 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపింది. ప్రాస్పెక్టస్ వివరాలకు ‘https://tgcet.cgg.gov.in’ సందర్శించవచ్చని సూచించింది.
News December 11, 2025
ఓటమిని తట్టుకోలేక పురుగు మందు తాగింది..

TG: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజాహైమద్పల్లిలో సర్పంచ్ ఎన్నికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఓటమిని తట్టుకోలేక అభ్యర్థి లక్ష్మి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబీకులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News December 11, 2025
బంగ్లాదేశ్కు చైనా ఫైటర్ జెట్లు.. భారత్కు ముప్పు?

బంగ్లాదేశ్కు 20 అత్యాధునిక J-10C ఫైటర్ జెట్లను సప్లై చేసేందుకు 2.2 బిలియన్ డాలర్ల డీల్కు చైనా అంగీకరించింది. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యూనుస్ చైనా నుంచి సబ్మెరైన్లు, ఆయుధ సామగ్రి కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో భారత్కు బంగ్లా నుంచి ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి. మాజీ ప్రధాని హసీనాకు ఆశ్రయం ఇస్తుండడంతో భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.


