News May 24, 2024

యూపీ యువతికి UK రాయల్ అవార్డు

image

UPకి చెందిన ఆర్తి(18)అనే ఇ-రిక్షా డ్రైవర్ లండన్‌లో ఉమెన్స్ ఎంపవర్‌మెంట్ అవార్డును అందుకున్నారు. పింక్ ఇ-రిక్షా నడుపుతూ ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచినందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. ఈ ఈవెంట్ తర్వాత ఆమె బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్ IIIని కలిసి ఫొటోలు దిగారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రిన్స్ ట్రస్ట్ ఇంటర్నేషనల్, అగాఖాన్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో కేంద్రం పింక్ ఇ-రిక్షా పథకాన్ని అమలు చేస్తోంది.

Similar News

News October 18, 2025

భార్యకు మంత్రి పదవి.. గర్వంగా ఉందన్న జడేజా

image

తన భార్య రివాబా జడేజాకు గుజరాత్ మంత్రివర్గంలో చోటు దక్కడంపై స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా హర్షం వ్యక్తం చేశారు. ‘నీవు సాధించిన విజయాలకు ఎంతో గర్వపడుతున్నా. అన్ని వర్గాల ప్రజలకు ప్రేరణగా నిలుస్తావని ఆశిస్తున్నా. మంత్రిగా గొప్ప విజయాలు సాధిస్తావని ఆకాంక్షిస్తున్నా. జైహింద్’ అని ట్వీట్ చేశారు. కాగా రివాబాకు విద్యాశాఖను కేటాయించారు.

News October 18, 2025

ఇవాళ ఒక్కరోజే 23వేల అప్లికేషన్లు

image

TG: లిక్కర్ షాప్స్‌కు ఈరోజు రికార్డు స్థాయిలో అప్లికేషన్స్ వచ్చాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇవాళ ఒక్కరోజే 23 వేల దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు మొత్తం 50వేలు దాటాయని పేర్కొంది. శనివారం చివరి రోజు కావడంతో మరో 50 వేలు అప్లికేషన్స్ వస్తాయని అంచనా వేస్తోంది. కాగా రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.

News October 18, 2025

ఒకేసారి ఇద్దరు యువతులతో యువకుడి పెళ్లి!

image

ఒక్కరితో సంసారమే కష్టమవుతోన్న ఈ రోజుల్లో ఓ యువకుడు ఒకేసారి ఇద్దరు యువతుల్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగింది. వసీమ్ షేక్ తన ఇద్దరు స్నేహితురాళ్లు షిఫా షేక్, జన్నత్‌ను ఒకే వేదికపై పెళ్లాడాడు. వాళ్లు ముగ్గురూ చాలా ఏళ్లుగా క్లోజ్ ఫ్రెండ్స్ అని, ఒకరి భావోద్వేగాలను మరొకరు అర్థం చేసుకుని ఇలా ఒక్కటయ్యారని సన్నిహితులు తెలిపారు. దీనిపై SMలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.