News May 24, 2024

యూపీ యువతికి UK రాయల్ అవార్డు

image

UPకి చెందిన ఆర్తి(18)అనే ఇ-రిక్షా డ్రైవర్ లండన్‌లో ఉమెన్స్ ఎంపవర్‌మెంట్ అవార్డును అందుకున్నారు. పింక్ ఇ-రిక్షా నడుపుతూ ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచినందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. ఈ ఈవెంట్ తర్వాత ఆమె బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్ IIIని కలిసి ఫొటోలు దిగారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రిన్స్ ట్రస్ట్ ఇంటర్నేషనల్, అగాఖాన్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో కేంద్రం పింక్ ఇ-రిక్షా పథకాన్ని అమలు చేస్తోంది.

Similar News

News March 13, 2025

దస్తగిరికి భద్రత పెంపు

image

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరికి ప్రభుత్వం భద్రత పెంచింది. గతంలో ఆయనకు 1+1 సెక్యూరిటీ ఉండగా ఇకపై 2+2కు గన్‌మెన్లను కేటాయించినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వివేకా హత్య కేసులో సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్న నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని ఆయన ఇటీవల విన్నవించారు. దీంతో సెక్యూరిటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

News March 13, 2025

రూపాయి గుర్తు ఎలా రూపొందించారంటే..

image

దివంగత ఆర్థిక మంత్రి ప్రణబ్ 2009 కేంద్ర బడ్జెట్ సమయంలో రూపాయికి గుర్తు సూచించాలని ఓపెన్ కాంపిటిషన్ ప్రకటించారు. 3331 డిజైన్లలో 5 షార్ట్ లిస్ట్ చేసి DMK మాజీ MLA కుమారుడు, ప్రొఫెసర్ ఉదయ్ పంపినది ఎంపిక చేశారు. ఇది దేవనాగరి లిపి र “ra”, లాటిన్ ఇంగ్లిష్‌లో నిలువు గీత లేని Rను పోలి ఉంటుంది. ₹లో 2 సమాన అడ్డగీతలు అసమానతల్లేని సంపద పంపిణీని సూచిస్తాయి.
PS: గతంలో Rs, Re, రూ. అని భిన్న రూపాయి సూచకాలుండేవి.

News March 13, 2025

అక్కడి మహిళలు 10 మందిని పెళ్లి చేసుకునే సంప్రదాయం: మంత్రి

image

ఉత్తర భారతంలో ఒక స్త్రీ 10మందిని వివాహం చేసుకునే సంప్రదాయం ఉందని తమిళనాడు మంత్రి మురుగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదే దక్షిణ భారతంలో అటువంటి కల్చర్ లేదన్నారు. జనాభా నియంత్రణ విధానాన్ని పక్కాగా అమలు చేయడంతో ఇక్కడి జనాభా తగ్గిందని, కానీ నార్త్ ఇండియాలో ఒకరు 10మందికి పైగా పిల్లల్ని కన్నారన్నారు. తమిళ సంస్కృతిని హేళన చేసేలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వారి నాలుక చీరేస్తానని మంత్రి హెచ్చరించారు.

error: Content is protected !!