News December 2, 2024
UNBELIEVABLE: బ్రేక్ చేయలేని రికార్డు!

క్రికెట్లో ఎన్నో రికార్డులు నమోదై, బద్దలవుతుంటాయి. ఎవ్వరూ అందుకోలేని రికార్డులూ ఉంటాయి. అందులో సచిన్ రికార్డులు ఫస్ట్. అయితే మరో భారత క్రికెటర్ కూడా ఎవరికీ సాధ్యంకాని ఓ రికార్డు నమోదు చేశారు. 1964లో లెఫ్టార్మ్ స్పిన్నర్ బాపు నాదకర్ణి ఇంగ్లండ్పై వరుసగా 21 ఓవర్లు మెయిడెన్ చేశారు. ఆ మ్యాచ్లో మొత్తం 32 ఓవర్లు వేసి కేవలం 5 రన్స్ ఇచ్చారు. తాజాగా WI బౌలర్ జేడెన్ సీల్స్ వరుసగా 6 మెయిడెన్స్ వేశారు.
Similar News
News October 23, 2025
నలభై ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే వ్యాధులివే..

40 ఏళ్ల తర్వాత మహిళల్లో అనేక వ్యాధులొచ్చే ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పని ఒత్తిడి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పలు శారీరక, మానసిక వ్యాధులొస్తాయంటున్నారు. ముఖ్యంగా బోలుఎముకలవ్యాధి, గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్, మానసిక ఒత్తిడి దాడి చేస్తాయంటున్నారు. శరీరంలో హార్మోన్ల మార్పులే వీటికి కారణమంటున్నారు. కాబట్టి మహిళలు 40 తర్వాత తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
News October 23, 2025
పూర్తి బకాయిలు చెల్లించేవరకు ఆందోళనలు: నెట్వర్క్ ఆసుపత్రులు

AP: ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి రూ.250 కోట్లు <<18076438>>రిలీజ్<<>> చేసినా నెట్వర్క్ ఆసుపత్రులు వెనక్కి తగ్గలేదు. తాము డిమాండ్ చేస్తున్న రూ.2,700 కోట్ల పూర్తి బకాయిలను చెల్లించాలని ఆసుపత్రుల అసోసియేషన్ కోరింది. పూర్తి బకాయిలు చెల్లించేవరకు ఆందోళన కొనసాగుతుందని ప్రకటించింది. ప్రభుత్వం విడుదల చేసిన వాటితో సరిపెట్టుకోలేమని స్పష్టం చేసింది. దీంతో ఇవాళ ‘చలో విజయవాడ మహాధర్నా’ యథాతథంగా ఉంటుందని పేర్కొంది.
News October 23, 2025
AUSvsIND: అడిలైడ్లో అదరగొడతారా?

అడిలైడ్ వేదికగా టీమ్ ఇండియా ఇవాళ ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడనుంది. సిరీస్లో నిలవాలంటే తొలి వన్డే ఓడిన గిల్ సేన ఈ మ్యాచులో తప్పక గెలవాలి. అటు కోహ్లీ, రోహిత్ తిరిగి ఫామ్ అందుకోవాల్సి ఉంది. మరోవైపు తొలి వన్డేలో విజయంతో ఆస్ట్రేలియా జోరు మీద ఉంది. దీంతో భారత్కు ఈ మ్యాచ్ కఠిన పరీక్ష కానుంది. ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. జియో హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్లో లైవ్ చూడవచ్చు.