News December 2, 2024

UNBELIEVABLE: బ్రేక్ చేయలేని రికార్డు!

image

క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నమోదై, బద్దలవుతుంటాయి. ఎవ్వరూ అందుకోలేని రికార్డులూ ఉంటాయి. అందులో సచిన్ రికార్డులు ఫస్ట్. అయితే మరో భారత క్రికెటర్ కూడా ఎవరికీ సాధ్యంకాని ఓ రికార్డు నమోదు చేశారు. 1964లో లెఫ్టార్మ్ స్పిన్నర్ బాపు నాదకర్ణి ఇంగ్లండ్‌పై వరుసగా 21 ఓవర్లు మెయిడెన్ చేశారు. ఆ మ్యాచ్‌లో మొత్తం 32 ఓవర్లు వేసి కేవలం 5 రన్స్ ఇచ్చారు. తాజాగా WI బౌలర్ జేడెన్ సీల్స్ వరుసగా 6 మెయిడెన్స్ వేశారు.

Similar News

News November 20, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ ముక్కోటి ఉత్సవాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
✓ భద్రాచలం: అక్రమ ఇసుక రవాణాకు అధికారుల అడ్డుకట్ట
✓ పినపాకలో నాటు సారా విక్రయాల కట్టడేది..?
✓ చర్ల: రోడ్డుకు ఇరువైపులా లారీలతో ప్రయాణికుల ఇబ్బందులు
✓ పినపాక: కారు-ఆటో ఢీ.. ఆటో డ్రైవర్‌కు గాయాలు
✓ కొత్తగూడెం: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
✓ కొత్తగూడెం: నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల గడువు పొడిగింపు

News November 20, 2025

పొగిడిన నోళ్లే తిడుతున్నాయ్.. కరెక్టేనా?

image

రాజమౌళి.. మొన్నటి వరకు తెలుగు సినీ కీర్తిని ప్రపంచ వేదికపై రెపరెపలాడించిన వ్యక్తి. బాలీవుడ్‌ ఆధిపత్యాన్ని ఎదురించి సౌత్ సినిమాను దేశవ్యాప్తం చేసిన డైరెక్టర్. కానీ ఇప్పుడు.. ఆస్కార్ తెచ్చాడని పొగిడిన నోళ్లే నేలకు దించేస్తున్నాయి. ప్రశంసించిన వాళ్లే విమర్శిస్తున్నారు. ‘దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు’ అన్న ఒకేఒక్క మాట జక్కన్నను పాతాళానికి పడేసిందా? అంతరాత్మ ప్రభోదానుసారం మాట్లాడటం తప్పంటారా? COMMENT

News November 20, 2025

ఎదురుపడ్డా పలకరించుకోని జగన్-సునీత!

image

అక్రమ ఆస్తుల కేసులో AP మాజీ సీఎం జగన్ ఇవాళ HYD నాంపల్లి CBI కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన బాబాయి వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా కోర్టులోనే ఉన్నారు. తన తండ్రి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని దాఖలు చేసిన పిటిషన్ వాదనల నేపథ్యంలో ఆమె న్యాయస్థానానికి హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలో అన్నాచెల్లెళ్లు ఎదురు పడినా ఒకరినొకరు పలకరించుకోలేదని, ఎవరో తెలియనట్లు వ్యవహరించినట్లు సమాచారం.