News July 11, 2024
వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కేంద్రమంత్రి

AP: కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంటుకు చేరుకున్నారు. సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి ఆయన ప్లాంట్ను పరిశీలిస్తున్నారు. మరికాసేపట్లో అధికారులు, కార్మిక సంఘాలతో ఆయన భేటీ కానున్నారు. ఉక్కు పరిశ్రమ నిర్వహణపై కుమారస్వామి ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.
Similar News
News November 26, 2025
ఆకుకూరల సాగుకు అనువైన రకాలు

ఆకుకూరల్లో చీడపీడలను తట్టుకొని, తక్కువ కాలంలో అధిక దిగుబడులను ఇచ్చే రకాలను సాగు చేస్తే మంచి దిగుబడులు పొందవచ్చు.
☛ తోటకూర: RNA-1, అర్కా సుగుణ, అర్కా అరుణిమ ఇవి ఎరుపు రకాలు. VARNA(VRA-I)
☛ పాలకూర: ఆల్ గ్రీన్, పూస జ్యోతి, అర్క అనుపమ, పూస పాలక్, జాబ్నర్ గ్రీన్
☛ గోంగూర: ANGRAU-12, ఎర్ర గోంగూర రకాలు: AMV-4, AMV-5, AMV-7
☛ మెంతికూర: పూస ఎర్లి బంచింగ, లామ్ సెలక్షన్-1, లామ్ మెంతి-2, లామ్ సోనాలి.
News November 26, 2025
సౌతాఫ్రికాతో టెస్ట్.. భారత్ 4 వికెట్లు డౌన్

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో IND ఓటమి దిశగా పయనిస్తోంది. 27/2 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన IND మరో 2 వికెట్లు కోల్పోయింది. నైట్ వాచ్మన్ కుల్దీప్(5) బౌల్డ్ కాగా, ఆ తర్వాత వచ్చిన జురెల్(2) ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పెవిలియన్కు వెళ్లిపోయాడు. దీంతో భారత్ 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు సాయి సుదర్శన్ కూడా ఔట్ కాగా నోబాల్ కావడంతో బతికిపోయాడు.
News November 26, 2025
ఆనంద నిలయం విశేషాలివే..

శ్రీవారి దర్శనంతో భక్తులకు అంతులేని ఆనందాన్ని ఇచ్చేదే ‘ఆనంద నిలయం’. ఇది ఆదిశేషుని పడగ మీద ఉన్న ఆనంద పర్వతంపై ఉంటుంది. ఆ కారణంగానే దీనికి ఆనంద నిలయం అనే పేరు వచ్చిందని ఐతిహ్యం. తొండమాను చక్రవర్తి నిర్మించిన ఈ నిలయానికి పల్లవ రాజు విజయదంతి విక్రమ వర్మ బంగారు పూతను, వీరనరసింగదేవ యాదవరాయలు తులాభారం ద్వారా బంగారు మలామాను చేయించారు. శ్రీనివాసుడు శిలగా మారింది ఈ ఆనంద నిలయంలోనే. <<-se>>#VINAROBHAGYAMU<<>>


