News April 27, 2024
ఓటు వేయని కేంద్రమంత్రి.. తీవ్ర విమర్శలు

BJP నేత, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓటు వేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆయన కేరళలోని తిరువనంతపురం నుంచి MPగా పోటీ చేస్తున్నారు. ఆయనకు బెంగళూరులో ఓటు హక్కు ఉంది. ఈ రెండుచోట్లా నిన్న పోలింగ్ జరిగింది. కాగా తాను తిరువనంతపురంలో ఉండటానికే ప్రాధాన్యం ఇచ్చానని, ఓటు వేయలేదని చెప్పారు. దీంతో బాధ్యత గల పదవిలో ఉండి ఓటు వేయకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News April 15, 2026
NLG: నేడు ఎంపీడీవో కార్యాలయంలో విచారణ..!

శాలిగౌరారం ఎంపీడీవో జ్యోతిలక్ష్మిపై అవినీతి ఆరోపణలు రావడంతోపాటు పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో ఒకరిపై ఒకరు కలెక్టర్కు ఫిర్యాదులు చేసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశానుసారం బుధవారం MPDO కార్యాలయంలో విచారణ చేపట్టేందుకు జిల్లా ఉన్నతాధికారులు రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. విచారణ నేపథ్యంలో ఎంపీడీవో, కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది తప్పకుండా విధులకు హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిసింది.
News April 15, 2026
IPLలో చెత్త ఫామ్పై రుతురాజ్ రెస్పాన్స్ ఇదే

IPL 2026లో <<19651830>>వరుస వైఫల్యాల<<>>తో సతమతమవుతున్న CSK కెప్టెన్ రుతురాజ్ ఎట్టకేలకు నోరు విప్పారు. KKRపై విజయం తర్వాత మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నా ఫామ్ గురించి ఆలోచనలు మెదడును తొలిచేస్తున్నాయి. ప్రస్తుతానికి మిగతా ఆటగాళ్లు నా వైఫల్యాన్ని కవర్ చేస్తున్నారు. ఒక భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాను. అది త్వరలోనే వస్తుందని నమ్ముతున్నాను’ అని రుతురాజ్ పేర్కొన్నారు.
News April 15, 2026
IPLలో చెత్త ఫామ్పై రుతురాజ్ రెస్పాన్స్ ఇదే

IPL 2026లో <<19651830>>వరుస వైఫల్యాల<<>>తో సతమతమవుతున్న CSK కెప్టెన్ రుతురాజ్ ఎట్టకేలకు నోరు విప్పారు. KKRపై విజయం తర్వాత మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నా ఫామ్ గురించి ఆలోచనలు మెదడును తొలిచేస్తున్నాయి. ప్రస్తుతానికి మిగతా ఆటగాళ్లు నా వైఫల్యాన్ని కవర్ చేస్తున్నారు. ఒక భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాను. అది త్వరలోనే వస్తుందని నమ్ముతున్నాను’ అని రుతురాజ్ పేర్కొన్నారు.


