News November 20, 2024
యూపీ ఉప ఎన్నికల్లో హోరాహోరీ

యూపీలోని 9 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు అధికార బీజేపీ, విపక్ష ఎస్పీ మధ్య హోరాహోరీగా జరిగినట్టు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. అధికార బీజేపీ 4 నుంచి 6 స్థానాల్లో గెలుస్తుందని డీఎన్ఏ వెల్లడించింది. ఇక విపక్ష ఎస్పీ 3-5 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. SP నుంచి నలుగురు, BJP ముగ్గురు, RLD, నిషాద్ పార్టీ నుంచి ఒకరు MLAలుగా రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
Similar News
News April 20, 2026
వైజాగ్ టు సింగపూర్.. ఇంటర్నేషనల్ క్రూయిజ్కు ఏర్పాట్లు

AP: గతంలో విశాఖ-చెన్నై మధ్య క్రూయిజ్ షిప్ సేవలు ప్రారంభమవగా తొలిసారి ఇంటర్నేషనల్ యాత్రకు రంగం సిద్ధమైంది. కార్డిలియో నౌక జులై 15న వైజాగ్ నుంచి సర్వీసును ఆరంభించనుంది. చెన్నై మీదుగా థాయిలాండ్లోని ఫుకెట్, మలేషియాలోని లంకావి, కౌలాలంపూర్, చివరగా సింగపూర్కు షిప్ చేరుకొని తిరిగి రానుంది. మొత్తం 14 రోజులపాటు విలాసవంతమైన నౌకా విహారం ఉండనుంది. టికెట్ రేట్లపై త్వరలో క్లారిటీ రానుంది.
News April 20, 2026
నేడు రెండో విడత ‘రైతు భరోసా’ విడుదల

TG: రైతుభరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తోన్న కర్షకులకు శుభవార్త. నేడు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం భారీ బహిరంగ సభలో బటన్ నొక్కి ఫండ్స్ రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికి పైగా రైతులకు రూ.5,653 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. గత నెల 23న తొలి విడత నిధులు ఇవ్వగా ఇప్పుడు రెండో ఎకరం వరకు నిధులు జమ కానున్నాయి.
News April 20, 2026
ముంబై మళ్లీ గెలుపుబాట పడుతుందా?

IPL: మొదటి మ్యాచ్ తర్వాత మళ్లీ గెలుపు రుచి చూడని ముంబై ఇండియన్స్ ఈరోజు గుజరాత్తో తలపడనుంది. వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న MI ఈ మ్యాచ్తోనైనా మళ్లీ గెలుపుబాట పట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో ఉన్న GT అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. ఈ జట్లు IPLలో ఎనిమిదిసార్లు తలపడగా GT ఐదుసార్లు గెలిచింది. ఈరోజు రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.


