News December 22, 2024
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు నోటీసులు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి UPలోని ఓ కోర్టు నోటీసులిచ్చింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ కులగణనపై మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన దేశ సంపదను పంచుతామని అన్నారు. ఆ వ్యాఖ్యలు దేశాన్ని విడదీసేలా ఉన్నాయంటూ పంకజ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు, వచ్చే నెల 7న విచారణకు హాజరుకావాలని రాహుల్ను ఆదేశించింది.
Similar News
News January 16, 2025
BREAKING: భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోలు మృతి
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోలు ఎదురుపడ్డారు. దీంతో మధ్యాహ్నం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇటీవల మావోలు మందుపాతర పేల్చడంతో ఎనిమిది మంది పోలీసులు చనిపోయిన విషయం తెలిసిందే.
News January 16, 2025
జారిపడ్డ పోప్.. చేతికి గాయం
పోప్ ఫ్రాన్సిస్ గాయపడ్డట్లు వాటికన్ సిటీ అధికారులు తెలిపారు. శాంటా మార్టాలోని తన నివాసంలో ఆయన ప్రమాదవశాత్తు జారి పడటంతో మోచేతికి గాయమైనట్లు వెల్లడించారు. అయితే ఎలాంటి బోన్ ఫ్రాక్చర్ కాలేదని, గాయం కావడంతో వైద్యులు కట్టు కట్టినట్లు పేర్కొన్నారు. కాగా గడిచిన రెండు నెలల్లో పోప్ గాయపడటం ఇది రెండోసారి. ఇటీవల ఆయన బెడ్ పైనుంచి కింద పడటంతో దవడకు దెబ్బ తగిలింది.
News January 16, 2025
రేపు ఓటీటీలోకి విడుదల-2?
వెట్రిమారన్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి, సూరి, మంజూ వారియర్ ప్రధానపాత్రల్లో నటించిన విడుదల-2 రేపు ఓటీటీలోకి రానున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంటున్నాయి. ఓటీటీలో 3 గంటల 44 నిమిషాల నిడివితో మూవీ ఉంటుందని తెలుస్తోంది. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోయినా వెట్రిమారన్ టేకింగ్, సేతుపతి నటన హైలైట్గా నిలిచాయి.