News February 6, 2025
ఉపాసన కొత్త కార్యక్రమం.. తొలుత పిఠాపురంలో అమలు

అపోలో ఆస్పత్రుల అధినేత, తన తాత ప్రతాప్ రెడ్డి బర్త్ డే(FEB5) సందర్భంగా ఉపాసన కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా శిశు సంక్షేమం కోసం పిఠాపురం నుంచి ప్రత్యేక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. గర్భిణులకు పౌష్ఠికాహారం, ప్రసూతి, శిశు మరణాలను అరికట్టడం, మహిళా సాధికారతపై అవగాహన కల్పించడం దీని ఉద్దేశమన్నారు. త్వరలోనే 109 అంగన్వాడీ భవనాలు పునరుద్ధరిస్తామని చెప్పారు.
Similar News
News December 21, 2025
ఫ్యూచర్ సిటా? తోక సిటా?: కేసీఆర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ‘మేం ఫార్మా సిటీ కోసం భూమి తీసుకున్నాం. దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నారు. విద్యార్థులను సాకలేని మీరు ఫ్యూచర్ సిటీ కడతారా? అది ఫ్యూచర్ సిటా? తోక సిటా? వనతార అంటూ జూపార్కును అమ్మేస్తారా? ఈ ప్రభుత్వంలో దిక్కుమాలిన పాలసీలు.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాలే కనిపిస్తున్నాయి’ అని ఫైరయ్యారు.
News December 21, 2025
RTCలో ఉచిత ప్రయాణానికి స్పెషల్ కార్డులు: భట్టి

TG: మహాలక్ష్మి స్కీమ్తో RTC లాభాల్లోకి వచ్చిందని, ఇప్పటివరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగినట్లు Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. మహిళల కోసం స్పెషల్ కార్డులు ఇస్తామన్నారు. నిజామాబాద్, వరంగల్కు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నట్లు వెల్లడించారు. స్కూల్స్ తెరిచేసరికి బుక్స్, యూనిఫామ్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నాయీబ్రాహ్మణ, రజకుల ఫ్రీ కరెంట్ బకాయిలు ఉండొద్దని సూచించారు.
News December 21, 2025
టైర్లు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

నేచురల్ రబ్బర్ నిజానికి తెల్లగా ఉంటుంది. కానీ వాహనాల టైర్లు నలుపు తప్ప మరో రంగులో కనిపించవు. దానికి ప్రధాన కారణం Carbon Black. దీన్ని రబ్బరుకు కలపడం వల్ల అది నల్లగా మారుతుంది. ఇది టైరుకు మంచి గ్రిప్ ఇస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే UV Rays తగలకుండా కాపాడుతుంది. దీనివల్ల టైర్లు త్వరగా అరిగిపోకుండా ఎక్కువ కాలం మన్నిక ఇస్తాయి.


