News February 6, 2025
ఉపాసన కొత్త కార్యక్రమం.. తొలుత పిఠాపురంలో అమలు

అపోలో ఆస్పత్రుల అధినేత, తన తాత ప్రతాప్ రెడ్డి బర్త్ డే(FEB5) సందర్భంగా ఉపాసన కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా శిశు సంక్షేమం కోసం పిఠాపురం నుంచి ప్రత్యేక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. గర్భిణులకు పౌష్ఠికాహారం, ప్రసూతి, శిశు మరణాలను అరికట్టడం, మహిళా సాధికారతపై అవగాహన కల్పించడం దీని ఉద్దేశమన్నారు. త్వరలోనే 109 అంగన్వాడీ భవనాలు పునరుద్ధరిస్తామని చెప్పారు.
Similar News
News December 14, 2025
ఏపీలో ₹లక్ష కోట్లతో ‘సాగర్మాల’ ప్రాజెక్టులు

AP: ‘సాగర్మాల’ కింద APలో ₹లక్ష కోట్లతో 110 ప్రాజెక్టులు ఏర్పాటుకానున్నట్లు కేంద్రం వెల్లడించింది. పారిశ్రామిక వృద్ధికి వీలుగా రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో పేర్కొంది. పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఆధునీకరణ, రోడ్డు, రైల్వే కనెక్టివిటీ పెంపు, కోస్టల్ కమ్యూనిటీ, షిప్పింగ్, జలమార్గాల అభివృద్ధి వంటివి ఇందులో ఉన్నాయి. వీటితో తీరప్రాంతం లాజిస్టిక్ హబ్గా మారుతుందని పేర్కొంది.
News December 14, 2025
మెస్సీకి ఎందుకంత ఫాలోయింగో తెలుసా?

మెస్సీ పదేళ్ల వయసులో గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ (GHD)తో బాధపడ్డారు. 4 అడుగుల కంటే ఎత్తు పెరగడని డాక్టర్లు తేల్చేశారు. ఇంజెక్షన్లకు నెలకు $900-1,000 కావడంతో అతడి కుటుంబం భరించలేకపోయింది. స్పెయిన్లోని FC బార్సిలోనా అతడి టాలెంట్ను గుర్తించి తమ అకాడమీలో జాయిన్ చేసుకోవడంతో పాటు ట్రీట్మెంట్ చేయించింది. ఆ తర్వాత స్టార్ అయిన మెస్సీ ఫౌండేషన్ స్థాపించి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ప్రపంచకప్ కూడా గెలిచారు.
News December 14, 2025
నెలకు రూ.20వేలు.. రేపటి వరకే ఛాన్స్

RBI సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్-2026 (3 నెలలు) దరఖాస్తుల గడువు రేపటితో (DEC 15) ముగియనుంది. PG, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు, LLB, ఎకనామిక్స్, ఫైనాన్స్, కామర్స్, బ్యాంకింగ్ రిలేటెడ్ సబ్జెక్టుల్లో డిగ్రీ చేస్తున్న వారు అర్హులు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి RBI ఆఫీసుల్లో పని చేసే అవకాశం, నెలకు రూ.20వేలు స్టైఫండ్ లభిస్తుంది.
వెబ్సైట్: <


