News January 29, 2025

సర్పంచ్ ఎన్నికలపై UPDATE

image

TG: పంచాయతీ రాజ్ శాఖపై సీఎం రేవంత్ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఆ శాఖలో పెండింగ్ జీతాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నేడు దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారా? ఏదైనా ప్రకటన చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Similar News

News July 6, 2025

ఎన్టీఆర్: ఎంటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో ఎంటెక్(CSE)- 2024 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షలను ఆగస్టు 6 నుంచి నిర్వహిస్తామని KRU అధ్యాపక వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 21లోపు ఎలాంటి ఫైన్ లేకుండా, 23లోపు రూ.200 ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చని, వివరాలకు https://kru.ac.in/ చూడాలని KRU అధ్యాపకులు సూచించారు.

News July 6, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* పిల్లలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: రేవంత్
* ఈనెల 12 నుంచి వడ్డీ లేని రుణాల పంపిణీ: భట్టి
* ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
* చర్చకు ప్రిపేరయ్యేందుకు 72 గంటల సమయం: కేటీఆర్
* మహిళలకు 5వేల ఈవీ ఆటోలు: మంత్రి పొన్నం
* AP: వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం
* వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు
* 20,494 ఎకరాల భూ సమీకరణకు CRDA ఆమోదం: మంత్రి

News July 6, 2025

టెస్టు చరిత్రలో తొలిసారి

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ టెస్టులో తొలిసారిగా 1000+ రన్స్ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్సులో 587 చేసిన గిల్ సేన రెండో ఇన్నింగ్సులో 427 పరుగులు చేసింది. ఇప్పటివరకు 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులే భారత జట్టుకు అత్యధికం. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో గిల్ ద్విశతకం, శతకం బాదగా ఇతర ప్లేయర్లు ఒక్క సెంచరీ చేయకపోవడం గమనార్హం.