News April 18, 2024
UPSC-2023 కటాఫ్ మార్కులు

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 కటాఫ్ మార్కులను UPSC ప్రకటించింది. *ప్రిలిమ్స్: జనరల్- 75.41, EWS- 68.02, OBC- 74.75, SC- 59.25, ST- 47.82 మార్కులుగా ప్రకటించింది.
*మెయిన్స్: జనరల్- 741, EWS-706, OBC- 712, SC- 694, ST- 692
*ఫైనల్: జనరల్- 953, EWS- 923, OBC- 919, SC- 890, ST- 891
>>గత కొన్నేళ్లతో పోలిస్తే ఈసారి కటాఫ్ ఎక్కువగా ఉంది.
Similar News
News January 24, 2026
బండి సంజయ్, అర్వింద్కు కేటీఆర్ లీగల్ నోటీసులు

TG: బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అర్వింద్కు కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. తనపై నిరాధార <<18938825>>ఆరోపణలు<<>> చేశారని పేర్కొన్నారు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదు రోజుల్లో వాటిపై వివరణ ఇచ్చుకోవాలన్నారు. లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో తనపై చేసిన వ్యాఖ్యలకు KTR నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
News January 24, 2026
ఎన్నికల ముంగిట మున్సిపాల్టీలకు ₹1000 కోట్లు

TG: మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం వాటిలో కనీస మౌలిక వసతులను మెరుగుపర్చేలా చర్యలు చేపట్టింది. వీటికోసం అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో TUIFDC ద్వారా చేపట్టే పనులకోసం ₹1000 కోట్ల నిధులను రుణం కింద తీసుకుంటోంది. హడ్కో నుంచి సేకరిస్తున్న ఈ రుణంతో పనులు ప్రారంభించనున్నారు. కాగా ఈ రుణాన్ని నెలవారీ వడ్డీతో వాయిదాల రూపంలో ప్రభుత్వం హడ్కోకు చెల్లించనుంది.
News January 24, 2026
ధరణి వల్లే భూభారతి స్కామ్: పొంగులేటి

TG: BRS ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్లో లొసుగులతోనే భూభారతి ద్వారా రిజిస్ట్రేషన్ డబ్బులు కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి తెలిపారు. 9జిల్లాల్లో 48మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి 4,848లావాదేవీల్లో లోటుపాట్లు జరిగినట్లు గుర్తించామని అధికారులు మంత్రికి తెలిపారు. విచారణలో 1,109డాక్యుమెంట్లకు సంబంధించి రూ.4Cr చెల్లింపులు జరగనట్లు తేల్చామన్నారు.


