News March 4, 2025
ఉర్దూ పాఠశాలల పని వేళలు మార్పు

AP: రంజాన్ మాసంలో రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలల పని వేళలు ఉ.8 నుంచి మ.1.30 వరకు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 3-30 వరకు ఈ మేరకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి ఫరూక్ ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాలు, తదితర సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మార్పు చేశామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసే ముస్లిం ఉద్యోగులు సాయంత్రం ఓ గంట ముందే వెళ్లేందుకు గత నెల అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 31, 2025
డియర్ కపుల్స్.. మళ్లీ కొత్తగా స్టార్ట్ చేయండి!

మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. అయితే దంపతులు కచ్చితంగా ఈ ఒక్క పని చేయాలి. ఈ ఇయర్లో జరిగిన గొడవలు, చేదు అనుభవాలు, నచ్చని విషయాలు, ఇద్దరినీ ఇబ్బంది పెట్టిన క్షణాలను ఈ ఏడాదికే పరిమితం చేయండి. వాటిని కొత్త సంవత్సరానికి మోసుకెళ్లి మీ మధ్య దూరాన్ని మరింత పెంచుకోకండి. సమస్యలుంటే ఇవాళే కూర్చుని మాట్లాడుకోండి. డియర్ కపుల్స్.. కొత్త సంవత్సరాన్ని కొత్తగానే స్టార్ట్ చేయండి. Happy New Year.
News December 31, 2025
EVMలతో కాదు.. ఓటర్ లిస్టులతోనే అవకతవకలు: TMC

ఓటర్ లిస్ట్లో అవకతవకలతో ఓట్ చోరీ జరుగుతోందని, EVMల ద్వారా కాదని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. బెంగాల్లో SIR తర్వాత ఎలక్టోరల్ రోల్స్పై పార్టీల అనుమానాలను నివృత్తి చేయడంలో ఎలక్షన్ కమిషన్ ఫెయిలైందని ఆరోపించారు. ఓటర్ల సంఖ్యలో తేడాలుంటే ఫైనల్ ఓటర్ లిస్ట్ను TMC అంగీకరించదని, లీగల్గా పోరాడుతుందన్నారు. 10 మంది పార్టీ లీడర్లు ECని కలిసిన తర్వాత అభిషేక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
News December 31, 2025
కంటెంట్ క్రియేటర్లకు మస్క్ గుడ్న్యూస్

‘X’లో క్వాలిటీ ఒరిజినల్ కంటెంట్ పొందడానికి క్రియేటర్లకు ఇచ్చే పేమెంట్స్ పెంచాలన్న ప్రపోజల్పై మస్క్ పాజిటివ్గా స్పందించారు. ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసే వారికి చెల్లించే మొత్తాన్ని భారీగా పెంచనున్నట్టు ప్రకటించారు. అయితే కంటెంట్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పారదర్శకంగా, కచ్చితంగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. చెల్లింపుల్లో యూట్యూబ్ అద్భుతంగా ఉందని అంగీకరించారు.


