News March 4, 2025
ఉర్దూ పాఠశాలల పని వేళలు మార్పు

AP: రంజాన్ మాసంలో రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలల పని వేళలు ఉ.8 నుంచి మ.1.30 వరకు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 3-30 వరకు ఈ మేరకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి ఫరూక్ ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాలు, తదితర సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మార్పు చేశామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసే ముస్లిం ఉద్యోగులు సాయంత్రం ఓ గంట ముందే వెళ్లేందుకు గత నెల అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 23, 2025
IPL-2025: చెన్నై, ముంబై జట్లు ఇవే

చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్లో CSK టాస్ గెలిచి బౌలింగ్ చేయనుంది. ఇరు జట్లను పరిశీలిస్తే..
CSK: రుతురాజ్ గైక్వాడ్(C), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, దూబే, జడేజా, శామ్ కరన్, ధోనీ, అశ్విన్, నూర్ అహ్మద్, ఎల్లిస్, ఖలీల్ అహ్మద్
MI: రోహిత్, ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ (C), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, శాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, సత్యనారాయణ రాజు
News March 23, 2025
టాస్ గెలిచిన CSK

IPL-2025: చెన్నై వేదికగా ఇవాళ MI, CSK జట్లు తలపడనున్నాయి. ముందుగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.
News March 23, 2025
రేషన్ కార్డుదారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్

TG: రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ APR నుంచి 6KGల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 84% మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. ఈ నెల 30న హుజూర్నగర్లో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నామన్నారు.