News July 25, 2024
ఇండియాలోని ఆ ప్రదేశాలకు వెళ్లొద్దని US హెచ్చరికలు

ఇండియాకు వచ్చే తమ పౌరులకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీలో పలు మార్పులు చేసింది. J&K, PAK బార్డర్, మణిపుర్, ఈశాన్య రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు వెళ్లొద్దంది. టెర్రరిజం, క్రైమ్, హింసను కారణాలుగా చూపింది. తూర్పు లద్దాక్ ప్రాంతం, లేహ్కు వెళ్లవచ్చంది. నక్సల్స్ తదితర ప్రభావమున్న తూర్పు MH, ఛత్తీస్గఢ్ వెళ్లాలనుకుంటే అనుమతి తీసుకోవాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో US ఎమర్జెన్సీ సేవలు పరిమితంగా ఉన్నాయంది.
Similar News
News December 26, 2025
బిందు సేద్యం.. ఈ జాగ్రత్తలు తీసుకుందాం

సాగులో నీటి వృథా కట్టడికి వాడే డ్రిప్ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో ట్రాక్టర్లు, బండ్లు, పశువుల రాకపోకల వలన లేటరల్ పైపులు అణిగిపోకుండా చూడాలి. ఎలుకలు డ్రిప్ సిస్టమ్లోని లేటరల్ పైపులను, ఇతర భాగాలను కొరికేయకుండా ఉండాలంటే సిస్టమ్ను తరచూ వాడాలి. దీని వల్ల భూమి తేమగా ఉండి ఎలుకలు ఆ పైపుల దగ్గరకురావు. కలుపు తీసేటప్పుడు పదునైన పరికరాలు డ్రిప్ లేటరల్ పైపులను కోసేయకుండా జాగ్రత్తపడాలి.
News December 26, 2025
రేపే రాజాసాబ్ ‘ప్రీ రిలీజ్’ ఈవెంట్

మారుతీ-ప్రభాస్ కాంబోలో రాజాసాబ్ చిత్రం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్కు మూవీ టీమ్ అదిరిపోయే గుడ్న్యూస్ అందించింది. HYDలో రేపు సా.5 గంటలకు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు.
News December 26, 2025
SM వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

16 ఏళ్లలోపు పిల్లలకు SM వాడకాన్ని బ్యాన్ చేసేలా ఆస్ట్రేలియా తరహాలో చట్టం చేయాలని మద్రాస్ హైకోర్టు కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇంటర్నెట్లో అడల్ట్ కంటెంట్ యాక్సెస్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. పేరెంటల్ కంట్రోల్స్ అందుబాటులోకి తెచ్చేలా ISPలను ఆదేశించాలని TN మధురై జిల్లాకు చెందిన ఎస్.విజయ్ కుమార్ PIL వేశారు. దానిపై విచారించిన జస్టిస్ జి.జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్ పై వ్యాఖ్యలు చేశారు.


