News July 25, 2024
ఇండియాలోని ఆ ప్రదేశాలకు వెళ్లొద్దని US హెచ్చరికలు

ఇండియాకు వచ్చే తమ పౌరులకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీలో పలు మార్పులు చేసింది. J&K, PAK బార్డర్, మణిపుర్, ఈశాన్య రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు వెళ్లొద్దంది. టెర్రరిజం, క్రైమ్, హింసను కారణాలుగా చూపింది. తూర్పు లద్దాక్ ప్రాంతం, లేహ్కు వెళ్లవచ్చంది. నక్సల్స్ తదితర ప్రభావమున్న తూర్పు MH, ఛత్తీస్గఢ్ వెళ్లాలనుకుంటే అనుమతి తీసుకోవాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో US ఎమర్జెన్సీ సేవలు పరిమితంగా ఉన్నాయంది.
Similar News
News January 29, 2026
₹3 కోట్లతో తీస్తే ₹30 కోట్ల వసూళ్లు.. ‘సిరాయ్’ చూశారా?

₹3 కోట్ల బడ్జెట్తో తమిళంలో తెరకెక్కిన సిరాయ్ మూవీ ₹31.58 కోట్ల వసూళ్లు సాధించింది. గతేడాది డిసెంబర్ 25న రిలీజై మేకర్లకు ఏకంగా 700% లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం Z5 OTTలో సందడి చేస్తోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఖైదీని జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లే ఓ కానిస్టేబుల్ (విక్రమ్ ప్రభు) కథే సిరాయ్. మూవీలో ట్విస్టులు, ఎమోషనల్ సీన్లు కట్టిపడేస్తాయి. యథార్థ సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు.
News January 29, 2026
ఈసారి ₹3.5 లక్షల కోట్లతో బడ్జెట్!

AP: FY26-27కి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు భారీగా పెరగొచ్చని తెలుస్తోంది. పెద్దఎత్తున పెట్టుబడులు, భారీ ప్రాజెక్టులు వస్తుండడమే దీనికి కారణం. Fy25-26లో బడ్జెట్ ₹3,22,359.33cr కాగా ఈసారి ₹3.5 లక్షల కోట్ల వరకు అది ఉంటుందని అంచనా. దీంతో పాటు అగ్రికల్చర్ బడ్జెట్ గతంలో ₹48,341cr కాగా ఈసారి ₹60000crకు పెరుగుతుందని సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు FEB 11 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
News January 29, 2026
రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

రిటైర్మెంట్ ప్రకటించి ఫ్యాన్స్ను షాక్కు గురిచేసిన ప్లేబ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ కొత్త జర్నీ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సాగిన ప్రయాణానికి పూర్తి భిన్నమైన రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. WBకు చెందిన ఆయన కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు సన్నిహిత వర్గాలను పేర్కొంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయబోరని సమాచారం.


