News February 27, 2025

నీటిని జాగ్రత్తగా వాడుకోండి.. AP, TGలకు KRMB సూచన

image

తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలతో కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో తక్కువ నీరు ఉన్నందున వృథా కాకుండా జాగ్రత్తగా వాడుకోవాలని సూచించింది. తాగు, సాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలంది. 15 రోజులకోసారి ఇరు రాష్ట్రాల అధికారులు పరిస్థితులను సమీక్షించుకోవాలని ఆదేశించింది. రెండు ప్రాజెక్టుల నుంచి తమకు 55TMCలు కావాలని ఏపీ, 63TMCలు ఇవ్వాలని తెలంగాణ కోరిన విషయం తెలిసిందే.

Similar News

News March 20, 2025

ఈ నెల 29న సూర్య గ్రహణం

image

ఈ నెల 29వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుందని నాసా తెలిపింది. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ భూమిపై నుంచి పాక్షికంగా కనిపిస్తుందని వెల్లడించింది. భారతీయులు ఈ గ్రహణాన్ని చూసే అవకాశం లేదని చెప్పింది. నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, నార్తర్న్ ఆసియా, సౌత్ అమెరికా, గ్రీన్ లాండ్, ఐలాండ్ దేశస్థులు గ్రహణాన్ని పాక్షికంగా చూడవచ్చని స్పష్టం చేసింది. కాగా, కొత్త ఏడాదిలో ఇది తొలి సూర్యగ్రహణం కావడం విశేషం.

News March 20, 2025

కేంద్ర మంత్రి కుటుంబంలో కాల్పుల కలకలం

image

కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ కుటుంబ సభ్యుల మధ్య కాల్పులు కలకలం రేపాయి. బిహార్‌లోని నవ్‌గచియాలో ఆయన మేనల్లుళ్లు అయిన విశ్వజిత్, జైజిత్ మధ్య నల్లా నీటి విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఇరువర్గాలు కాల్పులకు దిగాయి. విశ్వజిత్ బుల్లెట్ గాయాలతో మరణించగా జైజిత్, తల్లి(నిత్యనందరాయ్ సోదరి) గాయపడ్డారు. జైజిత్ పరిస్థితి విషమంగా ఉంది. వీరిని భాగల్పూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News March 20, 2025

అధికారం వచ్చాక నిరుద్యోగుల గొంతునొక్కారు: కేటీఆర్

image

TG: ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాపై కాంగ్రెస్ ఉక్కుపాదం మోపిందని కేటీఆర్ విమర్శించారు. తాజా బడ్జెట్‌ను ఉద్దేశించి రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదని దుయ్యబట్టారు. అధికారం కోసం అశోక్ నగర్ వెళ్లి, తీరా అధికారం వచ్చాక నిరుద్యోగుల గొంతునొక్కారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే అరెస్టులు, దాడులు చేస్తున్నారని, కాంగ్రెస్ అరాచక పాలన రాహుల్ గాంధీకి కనిపించట్లేదా అని నిలదీశారు.

error: Content is protected !!