News February 5, 2025

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ వార్నింగ్

image

TG: బీసీ కులగణనపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కోసమే రేపు సీఎం రేవంత్‌తో సమావేశం కానున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజల అపోహలు తొలగించడమే తమ లక్ష్యమని చెప్పారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర కులగణనపై అనవసర రాద్ధాంతం చేయొద్దన్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News December 1, 2025

WGL: వారెవ్వా.. ఇదేం కుటుంబ పాలన!

image

ఉమ్మడి WGL రాజకీయం కుటుంబ పాలనైంది. ఇదిలా ఉంటే చాలా నియోజకవర్గాల్లో కుటుంబ సభ్యులే అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. అల్లుళ్ల గిల్లుడుతో అధికారులు అల్లాడుతుండగా, మరో దగ్గర అత్త పెత్తనం, మరో రెండు చోట్ల కొడుకుల ఆర్డర్లతో అధికారులు నలిగిపోతున్నారు. ఒక దగ్గర “సన్”స్ట్రోక్ ఉండగా, మరో దగ్గర కొండంత దూరంలో భర్త పరుగులు పెట్టిస్తున్నాడు. గెలిచిన వాళ్లకంటే వారి కుటుంబీకులే కీలకంగా మారిపోయారనేది టాక్.

News December 1, 2025

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.660 పెరిగి రూ.1,30,480కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.600 ఎగబాకి రూ.1,19,600 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.4,000 పెరిగి రూ.1,96000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 1, 2025

ఈ దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటే?

image

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః|
అనాదినిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః||
తనంతట తాను అవతరించిన శాంతి స్వరూపుడు, సూర్యుడికి జన్మనిచ్చిన కలువ పూల కన్నులు కలవాడు విష్ణుమూర్తి. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించి, నిర్మించి, పాలించే ఆయనను పూజించడం కన్నా మోక్ష మార్గం మరొకటి లేదు. అందుకే ఆ దివ్య మంగళ రూపాన్ని ధ్యానించాలి. అప్పుడే మనస్సుకు శాంతి లభిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>