News March 6, 2025
తిరుమల అన్నప్రసాదంలో వడలు

AP: తిరుమల శ్రీవారి అన్నప్రసాదంతో పాటు మసాలా వడల పంపిణీని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. భక్తులకు ఆయన స్వయంగా వడ్డించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం అధికారులు తొలి రోజున 35వేల వడలను తయారుచేశారు. క్రమంగా ఈ సంఖ్యను లక్ష వరకు పెంచడానికి చర్యలు తీసుకోనున్నారు.
Similar News
News March 6, 2025
ఫైనల్లో నా సపోర్ట్ న్యూజిలాండ్కే: డేవిడ్ మిల్లర్

CT సెమీస్లో దక్షిణాఫ్రికా ఓటమికి ఇండియానే కారణమని సౌతాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ ఆరోపించారు. అస్తవ్యస్త పర్యటన వల్ల ప్రాక్టీస్ చేసే సమయం లేదన్నారు. భారత్ పాక్లో ఆడకపోవడం వల్లే తాము ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ఛాంఫియన్స్ ట్రోఫీ పైనల్లో తన మద్దతు న్యూజిలాండ్కేనని తెలిపారు. NZతో జరిగిన రెండో సెమీస్లో మిల్లర్ సెంచరీ చేసినప్పటికీ దక్షిణాఫ్రికా గెలవలేదు.
News March 6, 2025
దేశం పేరు వినలేదన్న ట్రంప్… ‘లెసోతో’ దేశం ప్రత్యేకతలివే…!

ఆఫ్రికాలోని ఈ దేశంలో గ్రామాలు చాలా ఎత్తులో ఉంటాయి. అక్కడికి వెళ్లాలంటే కాలినడక, గుర్రాలే మార్గం. తెల్లబంగారంగా పిలిచే ఇక్కడి నీటిని సౌతాఫ్రికాకు ఎగుమతి చేస్తారు. స్కీయింగ్కు బెస్ట్ ప్లేస్. సముద్ర మట్టానికి 3,222 మీటర్ల ఎత్తులో ఉంది. లెవిస్, రాంగ్లర్ బ్రాండ్లకు అవసరమైన జీన్స్ ఇక్కడే కుడతారు. వరల్డ్లోనే అత్యధిక HIVరేటు కలిగిన దేశం. అత్యధిక ఆత్మహత్యల రేటు నమోదయ్యేది
లెసోతోలోనే.
News March 6, 2025
SRH ప్లేయర్కు గాయం.. రీప్లేస్మెంట్ ఎవరంటే?

ఇంగ్లండ్ క్రికెటర్ బ్రైడన్ కార్స్ గాయం కారణంగా ఐపీఎల్-2025కి దూరమయ్యారు. గత ఏడాది జరిగిన వేలంలో అతడిని SRH కొనుగోలు చేసింది. ఇప్పుడు అతడి స్థానంలో సౌతాఫ్రికా క్రికెటర్ విల్లెమ్ ముల్డర్ను రూ.75లక్షలకు తీసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ముల్డర్ 11 టీ20లు, 18 టెస్టులు, 25 వన్డేలు ఆడారు. 60 వికెట్లు తీయడంతో పాటు 970 రన్స్ చేశారు. ఐపీఎల్ 18వ సీజన్ ఈనెల 22న ప్రారంభం కానుంది.