News April 22, 2024
ఒక్క ఓటుతో వాజ్పేయి సర్కార్ తలకిందులు!

1998 ఎన్నికల్లో 182 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ఇతరుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్పేయి ప్రధానిగా ప్రమాణం చేశారు. అయితే ఏడాదిన్నరలోపే ఆ లోక్సభ రద్దైంది. అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో బలపరీక్ష అనివార్యమైంది. BSP మద్దతు ఇస్తామని.. ఓటింగ్ సమయంలో ఎదురు తిరగడంతో ఒక్క ఓటుతో వాజ్పేయి సర్కార్ తలకిందులైంది. అయితే 1999 ఎన్నికల్లో NDA సంపూర్ణ మెజార్టీ సాధించింది.<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News April 6, 2026
ధోనీకి 2 రోజుల్లో ఫిట్నెస్ టెస్ట్?

CSK మాజీ కెప్టెన్ ధోనీ IPLలో త్వరలోనే ఆడే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2 రోజుల్లో ఆయనకు ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తారని CSK క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అందులో పాస్ అయితే ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీతో జరిగే మ్యాచులో ఆయన బరిలోకి దిగుతారంటున్నాయి. ఫిట్నెస్ లేక IPLకు రెండు వారాల పాటు ధోనీ దూరమవుతారని జట్టు యాజమాన్యం చెప్పిన విషయం తెలిసిందే. కాగా CSK ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓడిపోయింది.
News April 6, 2026
FLASH: పెరిగిన బంగారం, వెండి ధరలు

ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ (సీజ్ఫైర్) దిశగా సంకేతాలు రావడంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇవాళ <<19578430>>ఉదయంతో<<>> పోలిస్తే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,530 పెరిగి రూ.1,50,660కి చేరింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,400 వృద్ధితో రూ.1,38,100 వద్ద కొనసాగుతోంది. వెండి కూడా కేజీకి రూ.5,000 ఎగబాకి రూ.2,60,000 పలుకుతోంది.
News April 6, 2026
బుల్ జోరు.. భారీ లాభాలతో మార్కెట్లు క్లోజ్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 787 పాయింట్ల లాభంతో 74,106కు చేరగా నిఫ్టీ 255 పాయింట్లు లాభపడి 22,968 వద్ద సెటిల్ అయింది. US-ఇరాన్ సీజ్ఫైర్పై ఆశలు, రూపాయి కోలుకోవడం, బ్యాంకింగ్ షేర్లలో భారీగా కొనుగోళ్లు, ఐటీ షేర్ల జోరు మార్కెట్లకు కలిసొచ్చింది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్లో ట్రెంట్ అత్యధికంగా 7.89% లాభాలు నమోదు చేసింది.


