News August 14, 2024

హైకోర్టులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్

image

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే 23 మంది అరెస్ట్ కాగా వంశీ ఏ71గా ఉన్నారు. ఆయనపై దాడి కేసుతో పాటు హత్యాయత్నం అభియోగాలున్నాయి.

Similar News

News January 22, 2026

గెలుపు బాధ్యత పార్టీ MLAలు, ఇన్‌ఛార్జులకు అప్పగింత

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు పూర్తి బాధ్యతను పార్టీ MLAలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు BRS అప్పగించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీకి సమర్థులైన అభ్యర్థుల ఎంపిక బాధ్యతను వీరికే వదిలిపెట్టింది. ప్రచార అజెండా నిర్ణయంతో సహా పోల్ మేనేజ్మెంటు అంశాలనూ వీరే నిర్ణయించాలని నిర్దేశించింది. ఛైర్మన్, మేయర్ ఇతర పదవులకు ఎంపిక బాధ్యతనూ MLAలు, ఇన్‌ఛార్జులకే ఇచ్చింది.

News January 22, 2026

మదురో అరెస్ట్ ఆపరేషన్‌లో సీక్రెట్ వెపన్.. కన్ఫమ్ చేసిన ట్రంప్!

image

వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకున్న సమయంలో ఓ ప్రత్యేక రహస్య ఆయుధం వాడినట్లు వచ్చిన వార్తల్ని ట్రంప్ ధ్రువీకరించారు. తమ వద్ద ప్రపంచంలో ఏ దేశం దగ్గరా లేని ఆయుధాలు ఉన్నాయని తెలిపారు. వాటి గురించి అంతగా మాట్లాడకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. అవి చాలా శక్తిమంతమైనవని.. వాటి గురించి ఎవరికీ తెలియదన్నారు. మదురో అరెస్ట్ ఆపరేషన్‌లో సోనిక్ వెపన్ ప్రయోగించినట్లు వార్తలు వచ్చాయి.

News January 22, 2026

గర్భాశయం పొర మందంగా ఉందా?

image

స్త్రీ సంతానోత్పత్తిలో గర్భాశయం పొర ఎండోమెట్రియల్ మందం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే కొందరిలో ఎండోమెట్రియల్ లైనింగ్ మందం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నెలసరిలో బ్లీడింగ్ ఎక్కువరోజులు కావడం, స్పాటింగ్ కనిపించడం వంటివి జరుగుతాయంటున్నారు నిపుణులు. దీనికి ప్రధాన కారణం హార్మోన్లు. ఈ సమస్య తరచూ వస్తుంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్‌కు దారితీస్తుందంటున్నారు. కాబట్టి వెంటనే చికిత్స తీసుకోవాలి.