News March 11, 2025

వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు

image

AP: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్‌ను ఈ నెల 25 వరకు విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. నేటితో రిమాండ్ ముగియడంతో ఆయన్ను జైలు అధికారులు వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. సత్యవర్ధన్‌ కిడ్నాప్, బెదిరింపులు కేసులో వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News February 9, 2026

కోలుకుంటున్న శరద్ పవార్‌

image

తీవ్ర అస్వస్థతకు గురైన NCP చీఫ్ శరద్ పవార్ కోలుకుంటున్నారని ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డ ఆయనను ఇవాళ మధ్యాహ్నం పుణేలోని రుబీహాల్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు 5 రోజుల యాంటీబయాటిక్స్ కోర్స్ సజెస్ట్ చేసినట్లు సుప్రియ వెల్లడించారు. ఇటీవల శరద్ పవార్ సోదరుడి కుమారుడు, MH Dy.CM అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.

News February 9, 2026

‘సావర్కర్‌కు భారతరత్న’పై మాటల మంటలు

image

వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న RSS చీఫ్ మోహన్ భాగవత్ కామెంట్స్‌తో మరోసారి చర్చ మొదలైంది. అసలు ఆయన దేశానికి ఏం సేవ చేశారని ఆ బిరుదు ఇవ్వాలని కాంగ్రెస్, MIM ఘాటుగా ప్రశ్నించాయి. అటు భారతరత్న కంటే సావర్కర్‌ది ఎంతో పెద్ద స్థాయి అని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కామెంట్ చేశారు. సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

News February 9, 2026

పిల్లల SM వాడకంపై నియంత్రణకు ప్రణాళికలు: CBN

image

AP: పిల్లలకు సోషల్ మీడియా నుంచి రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు CM చంద్రబాబు తెలిపారు. మంత్రులు, కార్యదర్శులు, శాంతి భద్రతలపై DGP, SPలతో సమావేశమయ్యారు. ’16 ఏళ్లలోపు పిల్లలు SM వాడకాన్ని నియంత్రించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించాలి. మద్యం, డ్రగ్స్‌కు బానిసైన వారిని మార్చేలా చర్యలు తీసుకోవాలి. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలి’ అని సూచించారు.