News March 20, 2024

ఏప్రిల్ 1 నుంచి టెన్త్ జవాబుపత్రాల వాల్యుయేషన్

image

AP: టెన్త్ జవాబుపత్రాల వాల్యుయేషన్ ఏప్రిల్ 1 నుంచి చేపట్టనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆ రోజు నుంచి ఎనిమిది రోజులపాటు నిరంతరాయంగా మూల్యాంకనం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. మంగళవారం జరిగిన రెండో భాష పరీక్షకు 97.05% మంది హాజరయ్యారు. ఈ నెల 30వ తేదీతో టెన్త్ పరీక్షలు ముగియనున్నాయి.

Similar News

News September 8, 2025

బిగ్‌బాస్ సీజన్-9 కంటెస్టెంట్లు వీరే..

image

బిగ్‌బాస్ సీజన్-9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సెలబ్రిటీ కోటాలో తనూజ(ముద్ద మందారం), నటి ఆశా సైనీ, కమెడియన్లు సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, కొరియోగ్రఫర్ శ్రష్ఠి వర్మ, సీరియల్ నటుడు భరణి శంకర్, రీతూ చౌదరీ, నటి సంజనా గల్రానీ, ఫోక్ డాన్సర్ రాము రాథోడ్, సామాన్యుల నుంచి సోల్జర్ పవన్, మాస్క్ మ్యాన్ హరీశ్, డిమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి, మర్యాద మనీశ్‌ లోనికి వెళ్లారు.

News September 8, 2025

గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కన్నుమూత

image

నిర్మాత అల్లు అరవింద్ సన్నిహితుడు, గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగరాజు(76) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం నాగరాజు అంత్యక్రియలు HYDలో జరిగాయి. అంతకుముందు దర్శకుడు రవిరాజా పినిశెట్టి, బన్నీ వాసు, బండ్ల గణేశ్ తదితరులు మృతదేహానికి నివాళులు అర్పించారు. కొన్ని రోజుల క్రితం అల్లు అరవింద్ తల్లి మరణించిన సంగతి తెలిసిందే.

News September 7, 2025

గ్రహణం తర్వాత ఏం చేయాలంటే?

image

చంద్ర గ్రహణం తర్వాత ఉదయం లేచాక ఇంటిని శుభ్రం చేయాలని, వస్తువులపై పవిత్ర నది జలాలను చల్లి శుద్ధి చేయాలని పండితులు చెబుతున్నారు. రాత్రి మిగిలిన ఆహారాన్ని పడవేయడంతో పాటు తల స్నానం చేయాలని సూచిస్తున్నారు. దీంతో పాటు పేదలకు దుస్తులు, ఆహారం, పాలు, బియ్యం, చక్కెర వంటివి దానం చేస్తే మేలని చెబుతున్నారు. ఇప్పటికే ప్రారంభమైన చంద్రగ్రహణం అర్ధరాత్రి 2.25గంటల తర్వాత వీడనుంది.