News September 23, 2024
ఖాళీగా వందేభారత్.. ఇప్పుడైనా హాల్టింగ్ ఇవ్వాలని డిమాండ్

సికింద్రాబాద్-నాగ్పూర్ మధ్య ఇటీవల ప్రారంభించిన వందేభారత్ రైలుకు ఆక్యుపెన్సీ ఆశించినంతగా లేదు. మొత్తం 1328 సీట్లలో దాదాపు 1110 సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. రైలు ఆక్యుపెన్సీ 15.81% మించడం లేదు. ప్రస్తుతం TGలోని ఖాజీపేట, రామగుండం స్టేషన్లలోనే ఆగుతున్న ఈ రైలుకు మంచిర్యాల, పెద్దపల్లి, కాగజ్నగర్లో హాల్టింగ్ సౌకర్యం ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీంతో రైలు ఆక్యుపెన్సీ పెరుగుతుందని చెబుతున్నారు.
Similar News
News December 5, 2025
అఖండ-2పై లేటెస్ట్ అప్డేట్

ఫైనాన్స్, లీగల్ ఇష్యూలతో అఖండ-2 సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఓ డిస్ట్రిబ్యూటర్ ఫైనాన్షియర్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సినీవర్గాలు వెల్లడించాయి. అలాగే బాలకృష్ణ, బోయపాటి తమ రెమ్యునరేషన్లో కొంతభాగం వదులుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమకు రావాల్సిన రూ.28 కోట్లు+వడ్డీలో ఇప్పటికిప్పుడు 50% చెల్లించాలని <<18465729>>ఈరోస్<<>> డిమాండ్ చేస్తోందట. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది.
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<


