News April 20, 2024

తూర్పుగోదావరిలో జనసేనాని వారాహి యాత్ర

image

AP: ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జనసేనాని వారాహి యాత్ర నిర్వహించనున్నారు. కోరుకొండ బస్టాండ్‌లో సభ ఉంటుందని కూటమి అభ్యర్థి బత్తుల రామకృష్ణ తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ సభకు బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి హాజరుకానున్నారు. మరోవైపు పిఠాపురంలో పవన్ పర్యటించనున్నారు. టీడీపీీ నేతలతో సమావేశం కానున్నారు.

Similar News

News March 3, 2026

APPLY NOW: SPMCILలో ఉద్యోగాలు

image

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) 3 సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35 ఏళ్లు. నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.spmcil.com

News March 3, 2026

హైదరాబాద్‌లో ‘ఖొమేనీ’ రోడ్డు ఉందా?

image

ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ మృతితో ఆయన పేరు మార్మోగుతోంది. HYDలోనూ ‘ఖొమేనీ’ పేరిట రోడ్డు ఉందనే విషయం తెరపైకి వచ్చింది. బంజారాహిల్స్‌ రోడ్ నం.7ను ‘ఇమామ్ ఖొమేనీ రోడ్’ అని పిలుస్తారు. కానీ ఇది అలీ ఖమేనీ పేరిట పెట్టింది కాదు. ఇరాన్ తొలి సుప్రీం లీడర్ జ్ఞాపకార్థం పెట్టారు. ఇదే ప్రాంతంలో ఇరాన్ కాన్సులేట్ ఉండటం, కుతుబ్‌ షాహీల కాలంలో ఇరాన్‌తో సంబంధాల నేపథ్యంలో ఈ పేరు పెట్టినట్లు సమాచారం.

News March 3, 2026

‘హార్ముజ్’ బంద్.. మనకు ఆయిల్ ఎలా..?

image

హార్ముజ్ జలసంధిని ఇరాన్ <<19288027>>మూసేయడం<<>> తెలిసిందే. దీంతో దిగుమతులకు అంతరాయం కలిగితే మనపై పడే ప్రభావం గురించి చర్చ జరుగుతోంది. ఇండియా రోజూ 5 మిలియన్ బ్యారెల్స్ చమురు దిగుమతి చేసుకుంటుండగా, ఈ జలసంధి గుండా 2.5MB వస్తోంది. ప్రస్తుతం మన వద్ద 40-45 రోజులకు సరిపడా స్టాక్ ఉన్నట్లు ‘Kpler’ చెప్పింది. స్టోరేజీ ట్యాంకులు, రిజర్వులు, దేశం వైపు వచ్చే నౌకల్లో 100 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ నిల్వ ఉన్నట్లు తెలిపింది.