News February 10, 2025
రైతు బజార్లలో సబ్జీ కూలర్లు.. ఒక్కోటి రూ.27 లక్షలు

AP: రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో సబ్జీ కూలర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరగా పాడయ్యే కూరగాయలు, పూలు, ఆకు కూరలను 3-5 రోజులపాటు, క్యారెట్, బీట్ రూట్, ముల్లంగి వంటి వాటిని వారం రోజులపాటు వీటిలో నిల్వ చేసుకోవచ్చు. ఒక్కో కూలర్ ధర రూ.27 లక్షలు ఉంటుంది. ఇందులో 50% ఉద్యాన శాఖ సబ్సిడీ ఇవ్వనుండగా, మిగతా 50% రైతు బజార్లలోని స్టాల్స్ నిర్వాహకులు భరించాల్సి ఉంటుంది.
Similar News
News February 11, 2026
AIకి ప్రిపేర్ అవ్వకపోతే వెళ్లిపోవచ్చన్న గూగుల్

కంపెనీ AI ప్రణాళికలకు సిద్ధంగా లేని ఉద్యోగులు స్వచ్ఛందంగా విరమణ తీసుకోవచ్చని గూగుల్ పేర్కొంది. వారికోసం ఓ ప్యాకేజీని సైతం తీసుకొచ్చింది. USలో పనిచేసే గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్(GBO)లోని కొందరు ఉద్యోగులకు ఈ ప్యాకేజీ వర్తించనుంది. GBO అనేది గూగుల్ సంస్థ ఉత్పత్తులు, గ్లోబల్ రెవెన్యూ గ్రోత్ తదితరాలను పర్యవేక్షిస్తుంటుంది. అటు అమెజాన్, మెటా తదితర టెక్ కంపెనీలు ఇలాంటి ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి.
News February 11, 2026
సంక్రాంతి బరిలో మరో హీరో?

చాన్నాళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ వచ్చే సంక్రాంతికి అదృష్టం పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది. ‘ఆయ్’ ఫేమ్ అంజి డైరెక్షన్లో మూవీని ఓకే చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. టైటిల్తోనే పండుగ వైబ్ వచ్చేలా ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అనే పేరును లాక్ చేసినట్లు చర్చించుకుంటున్నాయి. అటు చిరు, బాలయ్య, వెంకీ, నాగ్తో పాటు శర్వానంద్, తేజా సజ్జ మూవీలు సంక్రాంతికి రిలీజ్ అవుతాయని టీటౌన్ వర్గాల మాట.
News February 11, 2026
VASTHU: స్మశానాలకు దగ్గర నివసించవచ్చా?

స్మశానాలకు దగ్గరగా నివసించడం శ్రేయస్కరం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘స్మశానాల వద్ద జరిగే కార్యక్రమాలు నిరాశను, వైరాగ్యాన్ని కలిగిస్తాయి. అక్కడి గాలి అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇది మనిషి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. అందుకే నిలకడైన అభివృద్ధి కోసం ఇలాంటి ప్రదేశాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోకపోవడమే ఉత్తమం’. అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>


