News December 25, 2024

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్

image

TG: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి జూపల్లి కృష్ణారావు స్వాగతం పలికారు. కాగా ఉపరాష్ట్రపతి మరికాసేపట్లో మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ఐసీఏఆర్-కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ రైతులతో ఆయన సమావేశమవుతారు. ఈ రాత్రికి కన్హా శాంతివనంలో బస చేస్తారు. రేపు ఉదయం తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

Similar News

News September 23, 2025

స్థానిక సంస్థలు.. బీసీలకు ఎన్ని స్థానాలంటే?

image

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇవి అమలైతే బీసీలకు 13 జడ్పీ, 237 MPP, జడ్పీటీసీ, 2,421 MPTC, 5,359 పంచాయతీ స్థానాలు దక్కనున్నట్లు సమాచారం. దీనిపై జీవో వచ్చాక మరింత క్లారిటీ రానుంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో 2,345 జీపీలు, 90 ZPTC, 95 ఎంపీపీ, 1,011 ఎంపీటీసీ, 6 ZP స్థానాలను బీసీలకు కేటాయించింది.

News September 23, 2025

నేడు శ్రీ గాయత్రీ దేవి అవతారం.. ఏ పూలతో పూజ చేయాలి?

image

దసరా నవరాత్రుల్లో రెండో రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తారు.. ఈ రూపంలో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి, పంచ ముఖాలు, పది కళ్లతో, భూమి, ఆకాశం, సృష్టిని సూచించే రంగుల కిరీటంతో ముక్తా, హేమ, నీల, విద్రుమ, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ ఉంటారు. ఈ రోజున అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పించాలి. పసుపు రంగు పూలతో పూజించాలి. ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదించాలి.

News September 23, 2025

రోజూ గాయత్రీ మంత్రం పఠిస్తే..

image

‘ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి! ధియో యో నః ప్రచోదయాత్!!’ అనే గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదని పురాణాలు చెబుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చొని జపం చేయాలి. ఇలా రోజూ చేస్తే జీవితంలో ఒత్తిడి, ఆందోళన తగ్గి సంతోషం, గెలుపు దక్కుతాయని, దుఃఖం, బాధలు, దారిద్ర్యం, పాపాలన్నీ తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు.