News February 8, 2025

మస్తాన్‌సాయి కేసులో ఏపీ అధికారి వీడియోలు

image

మస్తాన్ సాయి, శేఖర్ బాషా ప్రైవేట్ <<15374455>>వీడియోల<<>> కేసులో ఓ AP అధికారి లీలలు బయటికొచ్చాయి. అడిషనల్ SP స్థాయిలో పనిచేసిన ఆయన ఓ యువతితో ఉన్న ఫొటోలు, చాటింగ్ దృశ్యాలు వైరలవుతున్నాయి. ఓ కేసు విషయంలో వారిమధ్య ఏర్పడిన పరిచయం వీడియో కాల్స్ వరకు వెళ్లినట్లు సమాచారం. తర్వాత ఆయన మోసం చేశాడంటూ ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో యువతికి సాయం చేసిన శేఖర్ బాషా ఆ వీడియోలను తీసుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News March 22, 2025

భీమడోలు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

భీమడోలు రైల్వే గేట్ శ్రీకనకదుర్గమ్మ టెంపుల్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనపై ఎస్ఐ సుధాకర్ వివరాల ప్రకారం.. పెదవేగి (M) వేగివాడకు చెందిన ఘంట భరత్ (21), చల్లా సుబ్రహ్మణ్యం మిత్రులన్నారు. ఇద్దరూ బైక్‌పై తాడేపల్లిగూడెం వెళుతుండగా భీమడోలులో వెనక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టిందన్నారు. ఘటనలో భరత్ మృతి చెందగా.. సుబ్రహ్మణ్యాన్ని విజయవాడ ఆస్పత్రికి తరలించామన్నారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు.

News March 22, 2025

ఈ ఏడాది నైరుతిలో వర్షపాతం సాధారణమే

image

జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో కురిసే నైరుతి వర్షపాతం వ్యవసాయానికి కీలకం. ఈ ఏడాది అది సాధారణంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. నిరుడు డిసెంబరులో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి బలహీనమైన లానినా, ఈ ఏడాది మరింత బలహీనమవుతుందని వారు పేర్కొన్నారు. నైరుతి వచ్చేనాటికి ఎల్‌నినో వస్తుందని అంచనా వేశారు. పసిఫిక్, హిందూ మహాసముద్రాల మీదుగా చల్లగాలులు భారత్‌లోకి ప్రవేశించడం వల్ల నైరుతి వర్షాలు కురుస్తుంటాయి.

News March 22, 2025

రాష్ట్రంలో కొత్తగా 70 బార్ల ఏర్పాటు!

image

TG: ఆదాయం పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తులు చేస్తోంది. కొత్తగా 70 బార్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ఇన్‌కమ్ ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 1,171 బార్లు ఉండగా వీటిలో సగానికి పైగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్నాయి. మైక్రోబూవరీల సంఖ్యను పెంచే అవకాశమున్నట్లు సమాచారం.

error: Content is protected !!