News December 31, 2024
సీఎస్గా విజయానంద్ బాధ్యతల స్వీకరణ
AP: రాష్ట్ర సీఎస్గా సీనియర్ ఐఏఎస్ విజయానంద్ బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ ఈవో, హోం సెక్రటరీ, పలువురు ఐఏఎస్లు ఈ కార్యక్రమానికి హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు సీఎస్గా పనిచేసిన నీరభ్ కుమార్ పదవీ విరమణ చేశారు.
Similar News
News January 18, 2025
దొంగతనం చేయలేదు: కరీనా కపూర్
సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో ఆయన భార్య కరీనా కపూర్ స్టేట్మెంట్ను ముంబై పోలీసులు నమోదు చేశారు. దుండగుడు సైఫ్ను చాలా సార్లు పొడిచాడని ఆమె తెలిపారు. తమ కుమారుడు జహంగీర్ వద్దకు వెళ్లేందుకు పదే పదే ప్రయత్నించాడని, సైఫ్ అడ్డుకున్నారని పేర్కొన్నారు. కానీ ఇంట్లో ఎలాంటి డబ్బులు, ఆభరణాలు దొంగతనం చేయలేదని పోలీసులకు వెల్లడించారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News January 18, 2025
డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
AP: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభమైంది. ప్రాజెక్టు సీఈ, అధికారులు భూమిపూజ, హోమం నిర్వహించారు. అనంతరం వాల్ కాంక్రీట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.990 కోట్లు ఖర్చు చేయనుంది. సగం నిర్మాణం పూర్తి కాగానే దానిపై సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించనున్నారు.
News January 18, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్ల సునామీ
బాక్సాఫీస్ వద్ద ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ కలెక్షన్ల రాబడుతోంది. ఈ నెల 14న మూవీ విడుదల కాగా 4 రోజుల్లో రూ.131 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇవాళ, రేపు వీకెండ్స్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.