News January 6, 2025

ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

image

వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హైదరాబాద్‌లోని ఆ ఆఫీసుకు చేరుకున్నారు. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, సెజ్ వాటాలను తన నుంచి బలవంతంగా లాగేసుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో గతంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాకినాడ సెజ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కోణంపై ప్రధానంగా ఆయన్ను ప్రశ్నించనున్నట్లు సమాచారం.

Similar News

News January 18, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి

News January 18, 2025

రోడ్డు ప్రమాదంలో టీవీ నటుడు మృతి

image

ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీవీ నటుడు అమన్ జైస్వాల్(23) మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న బైక్‌ను ట్రక్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలైన అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు పేర్కొన్నారు. ట్రక్కు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అమన్ ‘ధర్‌తీపుత్ర్ నందిని’ అనే సీరియల్‌లో లీడ్ రోల్‌లో నటించారు.

News January 18, 2025

నిరాశపరిచిన సింధు

image

ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్ గ్రెగోరియా మారస్కా 9-21, 21-19, 17-21 పాయింట్ల తేడాతో సింధును ఓడించారు. తొలి రౌండ్‌లో పూర్తిగా తేలిపోయిన ఈ తెలుగు షట్లర్ రెండో రౌండ్‌లో పుంజుకున్నట్లు కనిపించినా మూడో రౌండ్లో నిరాశపరిచారు. మరోవైపు మెన్స్ డబుల్స్ జోడీ రంకి రెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.