News August 15, 2024

విజయవాడ-ఢిల్లీ కొత్త ఫ్లైట్ ఎప్పటినుంచంటే?

image

విజయవాడ, ఢిల్లీ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీసు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ ఫ్లైట్ ప్రతి రోజు ఉ.11:10కి విజయవాడ నుంచి బయల్దేరి మ.1:40కి ఢిల్లీ చేరుకుంటుందని, అక్కడి నుంచి తిరిగి ఉ.8:10కి బయల్దేరి ఉ.10:40కి విజయవాడకు చేరుతుందని తెలిపారు. ఇది అమరావతి, ఢిల్లీ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

Similar News

News October 26, 2025

DRDOలో ‌ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నారా?

image

<>DRDO <<>>అనుబంధ సంస్థ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ డెవలప్‌మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ సెంటర్ (CASDIC) 30 ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. BE, బీటెక్, MSc ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. నెలకు స్టైపెండ్ రూ.5వేల చొప్పున 6నెలలు చెల్లిస్తారు. hrd.casdic@gov.in ఇమెయిల్ ద్వారా NOV 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 25ఏళ్ల లోపు ఉండాలి. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/

News October 26, 2025

నల్లరంగు వల్ల బైకును గుర్తించలేకపోయా: డ్రైవర్

image

AP: రోడ్డుపై పడిన <<18102090>>బైక్<<>> నల్లరంగులో ఉండటంతో దూరం నుంచి సరిగా గుర్తించలేకపోయానని వేమూరి కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్య పోలీసులకు చెప్పాడు. వర్షంలో సడెన్ బ్రేక్ వేస్తే ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో ఆపకుండా బైకుపై నుంచి బస్సును పోనిచ్చినట్లు తెలిపాడు. కాగా ఈ ప్రమాదానికి ముందు 3 బస్సులు ఆ బైకును గుర్తించి పక్క నుంచి వెళ్లినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లే.

News October 26, 2025

ప్రెగ్నెన్సీలో పానీపూరి తింటున్నారా?

image

పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే ప్రెగ్నెన్సీలో సమతుల ఆహారం తీసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అయితే చాలామంది క్రేవింగ్స్ పేరుతో ఫాస్ట్‌ఫుడ్స్, స్వీట్స్ వంటివి అతిగా తీసుకుంటారు. ముఖ్యంగా పానీపూరి, ఫాస్ట్‌ఫుడ్‌, బిర్యానీ వంటివి అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తారు. వీటిని తింటే విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్‌ సమస్యలొస్తాయంటున్నారు. వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన ఆహారమే తినాలని సూచిస్తున్నారు.