News September 6, 2024
వినాయక చవితి: మట్టి గణపతినే పూజిద్దాం

హిందూధర్మంలో ప్రతి పండుగకు ఓ అర్థం ఉంటుంది. ప్రతి వేడుకా పర్యావరణ హితంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. గణేశ చతుర్ధికి వాడే పూజాపత్రాలన్నీ ప్రకృతిసిద్ధమైనవే. మరి పార్వతీపుత్రుడి విగ్రహాల్ని మాత్రం ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసినవి ఎందుకు వాడాలి? నిమజ్జనం అనంతరం నీటిలో సులువుగా కలిసిపోయేలా, ప్రకృతికి ఏమాత్రం హాని కలిగించని రీతిలో ఉండే మట్టి గణనాథుల్నే పూజకు వినియోగిద్దాం. ఆ గణపయ్య కృపకు పాత్రులవుదాం.
Similar News
News December 10, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

<
News December 10, 2025
నానో ఎరువులను ఎలా వాడాలి?

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.
News December 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 92

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


