News August 14, 2024

తీర్పు వచ్చేవరకు భారత్‌ రాకూడదని వినేశ్ నిర్ణయం?

image

ఒలింపిక్ మెడల్ విషయంలో రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆర్బిట్రేషన్ కోర్టు(CAS)ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 13నే తీర్పు రావాల్సి ఉన్నప్పటికీ న్యాయస్థానం 16కు వాయిదా వేసింది. తుది తీర్పు వచ్చేవరకు ఫొగట్ భారత్‌కు రాకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒలింపిక్స్‌ కేసుల్ని పరిష్కరించేందుకు గాను పారిస్‌లోనే CAS ఓ అడ్ హక్ డివిజన్‌ను ఏర్పాటు చేసింది. అందులోనే వినేశ్ కేసు ఉంది.

Similar News

News September 18, 2025

శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.

News September 18, 2025

ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 35 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/BE ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈనెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.177. SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

News September 18, 2025

మైథాలజీ క్విజ్ – 9

image

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>