News March 30, 2024
ఉల్లంఘనలపై ‘విజిల్’తో హెచ్చరిస్తున్నారు
సార్వత్రిక ఎన్నికల వేళ కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఈసీ ప్రవేశపెట్టిన ‘cVIGIL’ను ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి నిన్న ఉదయం వరకు 79వేలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ తెలిపింది. వీటిలో 99 శాతం ఫిర్యాదులను పరిష్కరించామంది. అక్రమ హోర్డింగులు, బ్యానర్లకు సంబంధించి దాదాపు 58,500, నగదు, బహుమతులు, మద్యం పంపిణీపై 1,400 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది.
Similar News
News January 24, 2025
కీలక స్థాయి వద్దకు BITCOIN
క్రిప్టో కరెన్సీ మార్కెట్ గత 24 గంటల్లో మోస్తరుగా పుంజుకుంది. మొత్తం మార్కెట్ విలువ $3.55Tకి చేరుకుంది. బిట్కాయిన్ నేడు $750 నష్టంతో $1,03,179 వద్ద కొనసాగుతోంది. దీనికిది కీలక స్థాయి. నిన్న $1,06,850 నుంచి $1,01,262 మధ్య చలించింది. అంటే $6000 మేర ఊగిసలాడింది. డామినెన్స్ 57.7%గా ఉంది. 1.73% లాభపడిన ఎథీరియం $3,290 వద్ద ట్రేడవుతోంది. XRP 2.42, SOL 0.41, DOGE 2.68, BNB 1.50, AVAX 3.77% ఎరుపెక్కాయి.
News January 24, 2025
BREAKING: టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్ను అందుబాటులో ఉంచనుంది.
News January 24, 2025
హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి విడాకులు?
సోషల్ మీడియాలో భాగస్వామి ఫొటోలను డిలీట్ చేయడం సెలబ్రిటీల విడాకులకు హింట్గా నెటిజన్లు భావిస్తున్నారు. తాజాగా హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి ఆ విధంగానే వార్తల్లో నిలిచారు. ఆమె తన భర్త వికాస్ వాసుతో దిగిన ఫొటోలను SM నుంచి తొలగించారు. దీంతో భర్తతో స్వాతి విడాకులు తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ ప్రమోషన్స్ సమయంలోనూ ఇలాంటి రూమర్సే రాగా స్పందించేందుకు స్వాతి నిరాకరించారు.