News October 3, 2024
ఉగ్ర దాడి: కొడుకును కాపాడి చనిపోయిన తల్లి!

ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో నిన్న జరిగిన టెర్రరిస్టుల కాల్పుల్లో 8 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో సెగెవ్ విగ్డర్ అనే 33ఏళ్ల మహిళ ఉన్నారు. ఆమె తన 9నెలల కొడుకును కాపాడుకునే క్రమంలో తూటాలకు బలయ్యారు. ఆమె కొడుకు ఆరి సురక్షితంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. సెగెవ్ ఒక ఫిట్నెస్ స్టూడియో ఓనర్ అని, తన భర్త రిజర్వ్ సైనికుడిగా పనిచేస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది.
Similar News
News October 29, 2025
రంగు చెప్పే ఆరోగ్య రహస్యం!

జీవనశైలి కారణంగా సంతానలేమి సమస్య పెరుగుతోంది. ఈక్రమంలో పురుషులు తమ ఆరోగ్య సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వీర్యం రంగును చెక్ చేసుకోవాలంటున్నారు. ఆకుపచ్చ రంగు ఇన్ఫెక్షన్ (STIs కూడా)కు సూచన కావొచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పసుపు రంగు యూరిన్ కలవడం లేదా సప్లిమెంట్ల ప్రభావమై ఉండొచ్చు. రెడ్ కలర్ రక్తానికి సంకేతం (వైద్య పరీక్ష అవసరం). తెలుపు/బూడిద రంగు హెల్తీ.
News October 29, 2025
మొదటి సంతానం అమ్మాయైతే వివక్ష తక్కువ

ప్రస్తుత సమాజంలో కొందరు ఆడపిల్లలపై ఇప్పటికీ వివక్ష చూపుతున్నారు. అయితే ఇళ్లల్లోనూ బిడ్డల మధ్య వివక్ష చూపడం సాధారణం అని భావిస్తారు. అయితే మొదటి సంతానం అమ్మాయి అయితే ఆ తండ్రుల్లో లింగ వివక్ష ధోరణి తక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అమ్మాయి పెరిగే క్రమంలో ఆమె ఎదుర్కొనే సవాళ్లే తండ్రి ఆలోచనా తీరులో ఈ మార్పుని తీసుకొస్తున్నాయని, దీన్నే మైటీ గర్ల్ ఎఫెక్ట్ అంటారని నిపుణులు చెబుతున్నారు.
News October 29, 2025
దైవారాధనలో ఆహార నియమాలు పాటించాలా?

దేహపోషణకే కాక, మోక్షప్రాప్తికి కూడా ఆహార నియమాలు ముఖ్యమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆహార నియమాలు పాటించడం వలన శరీరం ఆరోగ్యంగా ఉండి, మనస్సు స్థిరంగా, నిశ్చలంగా ఉంటుంది. దేవుడిపై మనస్సు లగ్నం కావాలంటే, కష్టపడి, నిజాయతీగా సంపాదించిన ఆహారాన్నే స్వీకరించాలి. దుఃఖం, కోపం, భయం కలిగించే ఆహారాలు భక్తికి ఆటంకం. కాబట్టి ఆత్మశుద్ధిని కాపాడే ఆహారం మాత్రమే భగవత్ చింతనకు, దైవ ప్రాప్తికి సహాయపడుతుంది. <<-se>>#Aaharam<<>>


