News October 3, 2024

ఉగ్ర దాడి: కొడుకును కాపాడి చనిపోయిన తల్లి!

image

ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో నిన్న జరిగిన టెర్రరిస్టుల కాల్పుల్లో 8 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో సెగెవ్ విగ్డర్ అనే 33ఏళ్ల మహిళ ఉన్నారు. ఆమె తన 9నెలల కొడుకును కాపాడుకునే క్రమంలో తూటాలకు బలయ్యారు. ఆమె కొడుకు ఆరి సురక్షితంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. సెగెవ్ ఒక ఫిట్‌నెస్ స్టూడియో ఓనర్ అని, తన భర్త రిజర్వ్ సైనికుడిగా పనిచేస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది.

Similar News

News March 20, 2026

‘జలజీవన్’ బిల్లుల చెల్లింపునకు రూ.1600 కోట్లు

image

AP: గ్రామీణ ప్రజలకు మంచినీటిని అందించే ‘జలజీవన్ మిషన్’ పనుల బిల్లులు త్వరలోనే క్లియర్ కానున్నాయి. దీనికి సంబంధించి ₹1600 CR చెల్లింపునకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక శాఖ ఆమోదించడంతో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించి పథకాలను త్వరితంగా అందుబాటులోకి తెచ్చేలా గ్రామీణ నీటిసరఫరా విభాగం చర్యలు చేపట్టింది. కాగా JJM కింద ఇంకా ₹1050CR బ్యాలన్స్ నిధులున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.

News March 20, 2026

‘జలజీవన్’ బిల్లుల చెల్లింపునకు రూ.1600 కోట్లు

image

AP: గ్రామీణ ప్రజలకు మంచినీటిని అందించే ‘జలజీవన్ మిషన్’ పనుల బిల్లులు త్వరలోనే క్లియర్ కానున్నాయి. దీనికి సంబంధించి ₹1600 CR చెల్లింపునకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక శాఖ ఆమోదించడంతో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించి పథకాలను త్వరితంగా అందుబాటులోకి తెచ్చేలా గ్రామీణ నీటిసరఫరా విభాగం చర్యలు చేపట్టింది. కాగా JJM కింద ఇంకా ₹1050CR బ్యాలన్స్ నిధులున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.

News March 20, 2026

ఇంటర్ వాల్యుయేషన్ వాయిదా

image

AP: రంజాన్ పండుగ సందర్భంగా ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ వాయిదా పడింది. మార్చి 21కి బదులుగా 22నుంచి వాల్యుయేషన్ స్టార్ట్ కానుందని విజయనగరం RIO తవిటినాయుడు తెలిపారు. తొలిరోజు లాంగ్వేజెస్, మ్యాథ్స్, హిస్టరీ, ఎకనామిక్స్, స్పెల్-1 ఒకేషనల్ పేపర్ల మూల్యాంకనం జరుగుతుంది. రెండో స్పెల్‌లో ఉండాల్సిన GFC పేపర్ల వాల్యుయేషన్‌ను కూడా 22 నుంచే నిర్వహించనున్నారు. ఈ వాయిదా ప్రభావం ఫలితాల వెల్లడిపై ఉండే అవకాశం ఉంది.