News October 3, 2024
ఉగ్ర దాడి: కొడుకును కాపాడి చనిపోయిన తల్లి!

ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో నిన్న జరిగిన టెర్రరిస్టుల కాల్పుల్లో 8 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో సెగెవ్ విగ్డర్ అనే 33ఏళ్ల మహిళ ఉన్నారు. ఆమె తన 9నెలల కొడుకును కాపాడుకునే క్రమంలో తూటాలకు బలయ్యారు. ఆమె కొడుకు ఆరి సురక్షితంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. సెగెవ్ ఒక ఫిట్నెస్ స్టూడియో ఓనర్ అని, తన భర్త రిజర్వ్ సైనికుడిగా పనిచేస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది.
Similar News
News January 2, 2026
కూనంనేని క్షమాపణలు చెప్పాలి: బండి సంజయ్

TG: PM మోదీకి <<18744541>>MLA కూనంనేని<<>> సాంబశివరావు క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ‘దేశంలో కమ్యూనిజం కనుమరుగవడానికి ఇలాంటి భాషే కారణమనిపిస్తోంది. అసెంబ్లీలో అలాంటి భాషకు స్థానంలేదు. ప్రభుత్వం, స్పీకర్ ఖండించకుండా మర్యాదని మరిచి వారి మిత్రపక్షాన్ని సమర్థించారు. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందుతుంటే.. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ రాజకీయాలు దుర్భాషల దగ్గరే ఆగిపోయాయి’ అని ట్వీట్ చేశారు.
News January 2, 2026
కాంటాక్ట్ నేమ్తో కాల్స్ వస్తున్నాయా? No Tension

ఈ మధ్య సేవ్ చేయని ఫోన్ నంబర్ నుంచి కాల్ వచ్చినా స్క్రీన్పై నేమ్ కన్పిస్తోందా? స్కామర్స్, స్పామర్స్కు చెక్ పెట్టేలా CNAP ఫీచర్ను ట్రాయ్ 2025 OCT నుంచి టెస్ట్ చేస్తోంది. ఈ కాలింగ్ నంబర్ ప్రజెంటేషన్ ఫీచర్ను MAR31 లోపు అమలు చేయనుంది. కనెక్షన్ టైంలో ఇచ్చే వివరాలతో టెలికం కంపెనీలు పేర్లు డిస్ప్లే చేస్తాయి. Spamగా Report చేస్తే డేటా అప్డేట్ అవుతుంది. ఇక True Caller లాంటి యాప్స్ అవసరం ఉండదు.Share It
News January 2, 2026
ఐడియా చెప్పండి.. రూ.2లక్షలు గెలుచుకోండి!

ఆధార్ డేటా విశ్లేషణ ద్వారా కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు UIDAI ‘నేషనల్ డేటా హ్యాకథాన్ 2026’ నిర్వహిస్తోంది. డేటా ఆధారిత పరిష్కారాలను చూపే విద్యార్థులు, టెక్ నిపుణులు ఇందులో పాల్గొనవచ్చు. ఉత్తమ ఐడియాలకు మొదటి బహుమతిగా రూ. 2లక్షలు, సెకండ్ రూ. 1.5 లక్షలు, 3rd రూ.75వేలు, ఫోర్త్ రూ.50వేలు, 5thకు రూ.25వేలు నగదు లభిస్తుంది. ఈనెల 5 నుంచి UIDAI వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.


