News August 4, 2024
విశాఖ రైల్వేజోన్కే మా తొలి ప్రాధాన్యత: కేంద్ర మంత్రి

AP: విశాఖ రైల్వేజోన్ తమ తొలి ప్రాధాన్యత అంశమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం గతంలోనే నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. కేంద్రం అడిగిన భూమిని సేకరించడంలో గత ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. దీంతో ఈ అంశం అక్కడే నిలిచిపోయిందన్నారు. ప్రస్తుతం కేంద్రం అడిగిన భూమిని సేకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News July 6, 2025
మస్క్ కొత్త పార్టీతో ట్రంప్నకు నష్టమేనా?

ఎలాన్ మస్క్ ‘అమెరికా పార్టీ’ స్థాపించడం రిపబ్లిక్, డెమొక్రాటిక్ పార్టీలకు నష్టం చేకూర్చే అవకాశముంది. ముఖ్యంగా ట్రంప్నకు తలనొప్పి తీసుకురావొచ్చు. మస్క్ అపర కుబేరుడు, ఒక గొప్ప వ్యాపారవేత్త, ఒక్క ట్వీటుతో లక్షల మందిని ప్రభావితం చేయగల ఇన్ఫ్లుఎన్సర్. పైగా ‘మేక్ అమెరికా.. అమెరికా అగైన్’, ప్రజలకు స్వేచ్ఛనిప్పిస్తా అంటున్నారు. అయితే USలో 3 పార్టీల విధానం వర్కౌట్ అవ్వదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
News July 6, 2025
ప్రభాస్తో రణ్వీర్ బాక్సాఫీస్ క్లాష్?

ప్రభాస్తో బాక్సాఫీస్ క్లాష్కి బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ రెడీ అవుతున్నట్లు బీ టౌన్లో వార్తలొస్తున్నాయి. ఇవాళ రణ్వీర్ పుట్టినరోజు సందర్భంగా ‘దురంధర్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజవుతోంది. ఈ మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ప్రభాస్తో పోటీకి దిగుతారా? అనేది వేచిచూడాలి.
News July 6, 2025
‘అమెరికా పార్టీ’ స్థాపిస్తున్న ఎలాన్ మస్క్

‘బిగ్ బ్యూటీఫుల్ బిల్’ పాసైతే మూడో పొలిటికల్ పార్టీ పెడతానని మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. మూడో పార్టీపై ట్విట్టర్లో రెండోసారి పోల్ పెట్టగా.. 12.48 లక్షల ఓట్లొచ్చాయి. 65.4% మంది మూడో పార్టీకి ఓటేశారు. ఈ నేపథ్యంలోనే “రెండు పార్టీలు ఒక్కటే అన్న అభిప్రాయంతో మీరు కొత్త పార్టీ కోరుకుంటున్నారు. ప్రజలకు స్వేచ్ఛను తిరిగి ఇచ్చేందుకు ఇవాళ ‘అమెరికా పార్టీ’ రూపుదిద్దుకుంది’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు.