News March 28, 2024
వివేకా మర్డర్ కేసు.. విచారణ ఏప్రిల్ 12కు వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్ శంకర్రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న జడ్జి.. తదుపరి విచారణను ఏప్రిల్ 12కు వాయిదా వేశారు.
Similar News
News January 13, 2025
ఇవాళ హైడ్రా ప్రజావాణికి సెలవు
TG: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సంక్రాంతి సెలవుల కారణంగా ఇవాళ ఉండదని హైడ్రా ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ సెలవులలో ప్రజావాణి నిర్వహించట్లేదని గతంలోనే ప్రకటించినట్లు తెలిపింది. వచ్చే సోమవారం(20.01.2025) తిరిగి నిర్వహిస్తామని పేర్కొంది.
News January 13, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 13, సోమవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.01 గంటలకు
✒ ఇష: రాత్రి 7.17 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 13, 2025
భోగి మంటల వెనుక శాస్త్రీయ కోణం!
భోగీ నాడు ఊరువాడ భోగి మంటలు వేయడం అనవాయితీగా ఉన్నా దీనికి శాస్త్రీయ కోణం ఉంది. ఈ మంటలు వేయడం వల్ల పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా సామాజిక బంధాలు బలపడతాయి. అందరూ ఒక చోట చేరడంతో ఐక్యత పెరుగుతుంది. చలి కాలంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇంట్లోని చెత్తను నిర్మూలించడమే కాకుండా ఈ బూడిద నుంచి పోటాషియం వంటి ఖనిజాలు మట్టికి అందుతాయి. ఈ మంటల్లో పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ది అవుతుంది.