News March 18, 2024
విజయనగరం: ‘త్వరలో నా నిర్ణయం ప్రకటిస్తా’

విజయనగరం నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిని పోటీలో నిలపడంపై నిర్ణయం తీసుకుంటామని వైసీపీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు అన్నారు.ఆదివారం అంబటి సత్రంలో ఆయన మాట్లాడారు.ఉత్తరాంధ్రలో వైసీపీ యాదవులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, జిల్లాకు సంబంధించి ఒక్క పార్టీకూడా తమ వర్గాన్ని పట్టించుకోలేదన్నారు. పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నా..టికెట్ ఇవ్వలేదని, వైసీపీ మోసం చేసిందన్నారు.
Similar News
News December 13, 2025
VZM: గుండె ఆగింది… కానీ చూపు కొనసాగింది

కంటి వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఓ వృద్ధుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. అయినా ఆయన కుటుంబం అంత శోకంలోనూ మానవీయతను చాటింది. చీపురుపల్లికి చెందిన రిటైర్డ్ డిప్యూటీ ఎంపీడీఓ కర్రోతు అప్పారావు (73) శుక్రవారం కంటి పరీక్షల కోసం విజయనగరానికి వెళ్లి అక్కడే కన్నుమూశారు. ఈ విషాదంలోనూ కుటుంబసభ్యులు నేత్రదానానికి అంగీకరించారు. రెడ్క్రాస్, మానవీయత స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కార్నియా సేకరించారు.
News December 13, 2025
మానవత్వం చాటుకున్న VZM ఎస్పీ.. రోడ్డు ప్రమాద బాధితురాలికి తక్షణ సాయం

ఎస్పీ ఏఆర్.దామోదర్ గరివిడిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్నప్పుడు గుర్ల మండలం దుగ్గివలస గ్రామ సమీపంలో బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక మహిళను గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి, గాయపడిన మహిళకు సపర్యలు చేశారు. అనంతరం అటుగా వస్తున్న ఆటోను చికిత్స కోసం నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
News December 13, 2025
24న జాతీయ వినియోగదారుల దినోత్సవం: VZM JC

జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఈనెల 24న నిర్వహించాలని విజయనగరం జేసీ ఎస్.సేథు మాధవన్ సూచించారు. శుక్రవారం తన ఛాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 18వ తేదీ నుంచి వినియోగదారుల వారోత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈసారి ‘డిజిటల్ న్యాయపాలన, సమర్థ సత్వర పరిష్కారం’ ఇతివృత్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిషులో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు ఉంటాయన్నారు.


