News March 18, 2024

విజయనగరం: ‘త్వరలో నా నిర్ణయం ప్రకటిస్తా’

image

విజయనగరం నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిని పోటీలో నిలపడంపై నిర్ణయం తీసుకుంటామని వైసీపీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు అన్నారు.ఆదివారం అంబటి సత్రంలో ఆయన మాట్లాడారు.ఉత్తరాంధ్రలో వైసీపీ యాదవులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, జిల్లాకు సంబంధించి ఒక్క పార్టీకూడా తమ వర్గాన్ని పట్టించుకోలేదన్నారు. పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నా..టికెట్ ఇవ్వలేదని, వైసీపీ మోసం చేసిందన్నారు.

Similar News

News July 8, 2024

పార్వతీపురం: ‘నాణ్యమైన ఆహారం అందించాలి’

image

వసతి గృహాల్లో చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక సాయి నగర్ కాలనీలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌గా విధుల్లో చేరిన రోజే ఆశ్రమ పాఠశాల నిర్వహణపై దృష్టి సారించారు. విద్యార్థులకు వండిన వంటకాలను రుచి చూశారు.

News July 8, 2024

పార్వతీపురం: 4వ రోజు 117 మందికి ఈ సెట్ కౌన్సెలింగ్

image

4వ రోజు 117 మందికి ఈసెట్ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎమ్మార్ నగరం పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపల్ విలియం క్యారీ అన్నారు. స్థానిక కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టమన్నారు. ఈనెల 10వ తేదీ వరకు వెరిఫికేషన్ కార్యక్రమం ఉంటుందన్నారు. తొలి నాలుగు రోజులు కలిపి 510 ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

News July 7, 2024

గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

గంట్యాడ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో గంట్యాడకి చెందిన హరీశ్ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.