News March 18, 2024
విజయనగరం: ‘త్వరలో నా నిర్ణయం ప్రకటిస్తా’

విజయనగరం నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిని పోటీలో నిలపడంపై నిర్ణయం తీసుకుంటామని వైసీపీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు అన్నారు.ఆదివారం అంబటి సత్రంలో ఆయన మాట్లాడారు.ఉత్తరాంధ్రలో వైసీపీ యాదవులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, జిల్లాకు సంబంధించి ఒక్క పార్టీకూడా తమ వర్గాన్ని పట్టించుకోలేదన్నారు. పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నా..టికెట్ ఇవ్వలేదని, వైసీపీ మోసం చేసిందన్నారు.
Similar News
News March 11, 2026
దువ్వాడ-విశాఖ-విజయనగరం రైల్వే లైన్ అప్గ్రేడ్కు గ్రీన్ సిగ్నల్

ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని 106 కి.మీ.ల దువ్వాడ-విశాఖ-VZM సెక్షన్లో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థ అప్గ్రేడ్కు రైల్వే శాఖ రూ.318.07 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న 1×25 KV వ్యవస్థను ఆధునిక 2×25 KVగా మార్చనున్నారు. దీంతో విద్యుత్ సరఫరా పెరిగి రైళ్ల వేగం, సరకు రవాణా సామర్థ్యం మెరుగుపడనుంది. హౌరా-చెన్నై మార్గంలో ఉన్న ఈ సెక్షన్ ద్వారా ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి ఖనిజాలు విశాఖ పోర్టుకు తరలిస్తారు.
News March 11, 2026
విజయనగరం: పోస్టల్ బీమాతో రూ.15 లక్షల ఆర్థిక సాయం

పోస్ట్ ఆఫీసు యాక్సిడెంటల్ పాలసీ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుందని విజయనగరం పోస్టల్ సూపరింటెండెంట్ కె శ్రీనివాసు అన్నారు. మంగళవారం దత్తిరాజేరులో ప్రమాదవశాత్తు మృతి చెందిన మర్రివలస గ్రామస్థుడు కోరాడ లక్ష్మణ్ రావు కుటుంబానికి రూ.15 లక్షల బీమా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో గజపతినగరం పోస్టల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర పాల్గొన్నారు. ఈ పాలసీని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అధికారులు కోరారు.
News March 10, 2026
విజయనగరం: గుండెపోటుతో ఆరోగ్యమిత్ర మృతి

విజయనగరంలో ఆరోగ్యమిత్రాగా పనిచేస్తున్న చింతల మహేశ్ (36) మంగళవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. కొత్తవలస గ్రామానికి చెందిన ఈయన గత 15 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ పథకంలో సేవలందిస్తున్నారు. మహేశ్ మరణంతో ఆయనపైనే ఆధారపడిన తల్లి, చెల్లి దిక్కులేనివారయ్యారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది మహేశ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కోరారు.


