News March 18, 2025
VKD: రాష్ట్రంలోనే వికారాబాద్ టాప్

తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఆర్టీసీ కార్గో బుకింగ్ చేసింది వికారాబాద్ డిపోనే అని వికారాబాద్ డిపో అని మేనేజర్ అరుణ అన్నారు. గత నాలుగు సంవత్సరాలలో 2 దపాలుగా మేడారం జాతర సమ్మక్క, సారక్క మొక్కు బంగారం, 3 దపాలుగా భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు భక్తుల ఇంటి వద్దకే అందించడంలో వికారాబాద్ జిల్లాలోని భక్తులు అత్యధికంగా బుకింగ్ చేసుకొని రాష్ట్రంలోనే వికారాబాద్ డిపో మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
Similar News
News March 18, 2025
సిద్దిపేట జిల్లా ప్రజలారా.. జర జాగ్రత్త

సిద్దిపేట జిల్లాలో రోజురోజుకు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. ఎండ తీవ్రత, వడగాల్పులు సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. అవసరమైతే తప్ప అనవసరంగా బయటకు రావొద్దని చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటూ నెత్తికి టోపీ లేదా రుమాలు కట్టుకొని, కాటన్ వస్త్రాలు ధరించాలని సూచించారు.
News March 18, 2025
ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు, లోకేశ్

AP: మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ఎల్లుండి తిరుమల వెళ్లనున్నారు. ఆయన వెంట మంత్రి లోకేశ్ సహా కుటుంబ సభ్యులు ఉండనున్నారు. ఈ సందర్భంగా నిత్యాన్నదాన పథకానికి వారి కుటుంబం విరాళం ప్రకటించనుంది. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించనుంది. ఆ తర్వాతి రోజు టీటీడీ పరిపాలనా వ్యవహారాల్ని CBN సమీక్షిస్తారని తెలుస్తోంది.
News March 18, 2025
VKB: నిరీక్షణకు ఫలితం దక్కింది

దుద్యాలకి చెందిన మాసుల పద్మమ్మ, చిన్న సాయన్న కొడుకు మాసుల శశివర్ధన్ నిరీక్షణకు ఫలితం దక్కింది. 11 సంవత్సరాలుగా విద్యాశాఖలో సీఆర్పిగా విధులు నిర్వర్తిస్తూ చదివి హాస్టల్ వెల్ఫేర్ జాబ్ సాధించాడు శశివర్ధన్. తల్లిదండ్రులు కలను నెరవేర్చాడు. అతణ్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.