News June 11, 2024

భారత్, పాక్ మ్యాచ్‌పై వ్లాగ్.. యూట్యూబర్ కాల్చివేత

image

భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ గురించి చేసిన వ్లాగ్ ఓ యూట్యూబర్ ప్రాణాలు తీసింది. పాకిస్థాన్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాక్‌కు చెందిన యూట్యూబర్ సాద్ అహ్మద్ కరాచీలో మ్యాచ్ గురించి జనాల అభిప్రాయం తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఓ సెక్యూరిటీ గార్డ్‌ను పదే పదే ప్రశ్నలతో విసుగెత్తించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సెక్యూరిటీ గార్డ్ యూట్యూబర్‌ను కాల్చగా, ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించాడు.

Similar News

News March 21, 2025

అలా జరిగితే ‘మ్యాడ్ స్క్వేర్’ రికార్డు!

image

నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ ఈనెల 28న విడుదల కానుంది. వారం రోజుల్లో విడుదలవనుండగా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయకూడదని మేకర్స్ భావిస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇలా జరిగితే ట్రైలర్ లేకుండా రిలీజైన తొలి సినిమాగా రికార్డులకెక్కనుంది. కాగా, ‘మ్యాడ్ స్క్వేర్’పై భారీగా అంచనాలున్నాయి.

News March 21, 2025

CUET UG దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్

image

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) <>దరఖాస్తు<<>> గడువు రేపటితో ముగియనుంది. మార్చి 23లోగా ఫీజు చెల్లించవచ్చు. ఈనెల 24-26 వరకు దరఖాస్తు సవరణలకు అవకాశం ఉంటుంది. మే 8-జూన్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ వర్సిటీల్లో UG కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను CBT విధానంలో 13 భాషల్లో నిర్వహించనున్నారు.

News March 21, 2025

పచ్చళ్లు అతిగా తింటే క్యాన్సర్ రావొచ్చు!

image

అతిగా పచ్చళ్లు తినడం ప్రమాదకరమని ప్రముఖ వైద్యుడు శ్రీకాంత్ పేర్కొన్నారు. ‘పచ్చళ్ళలో పెరిగే శిలీంధ్రాలు (బూజు/ఫంగస్) నైట్రేట్లని నైట్రైట్లుగా మారుస్తాయి. ఇవి క్యాన్సర్ కారకాలు. అప్పుడప్పుడూ తిన్నవారిని ఇవేం చేయలేవు. కానీ, అదేపనిగా తింటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ ఇది ప్రమాదకరమే. నిలువ పచ్చళ్ల కంటే అప్పుడే చేసిన రోటి పచ్చళ్లు సేఫ్’ అని తెలిపారు.

error: Content is protected !!