News April 19, 2024
మే 3న ‘ఇంటి నుంచి ఓటు’ ప్రారంభం

TG: ‘ఇంటి నుంచి ఓటు’ హక్కు వినియోగించుకోవాలనుకునే వయోవృద్ధులు, దివ్యాంగులు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. మే 3 నుంచి 8లోగా వారి ఓటు నమోదు చేస్తామన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం 3,31,48,527 ఓటర్లుగా నమోదయ్యారని, ఈ నెల 15 వరకు స్వీకరించిన దరఖాస్తుల్లో 1.17 లక్షల అర్జీలను పరిష్కరించాల్సి ఉందని వెల్లడించారు.
Similar News
News January 18, 2026
మెరిసిన మంధాన.. RCB ఘన విజయం

WPL: ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో RCB 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ స్మృతి మంధాన(96), జార్జియా హాఫ్ సెంచరీ(54*)తో రాణించడంతో 167రన్స్ లక్ష్యాన్ని RCB సునాయాసంగా ఛేదించింది. DC బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. మారిజాన్, నందినీ శర్మలకు చెరో వికెట్ దక్కింది. ఢిల్లీ తరఫున షెఫాలీ వర్మ(62) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు 8 పాయింట్లతో టేబుల్ టాపర్గా కొనసాగుతోంది.
News January 18, 2026
రేపు మౌని అమావాస్య.. ఉదయమే ఇలా చేయండి

రేపు పవిత్రమైన ‘<<18871132>>మౌని అమావాస్య<<>>’. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి భూమాతకు నమస్కరించాలి. పుణ్యస్నానం ఆచరించాలి. ఉదయం సూర్య నమస్కారం చేయాలి. అనంతరం శ్రీహరి, మహాలక్ష్మీ, గంగామాతను పూజించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి. రేపు మౌనవ్రతం చేయడం వల్ల పుణ్యం సిద్ధిస్తుంది.
News January 17, 2026
బీజేపీకి ఓటేస్తేనే అభివృద్ధి: బండి సంజయ్

TG: త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ‘విజయ సంకల్ప సమావేశం’లో ఆయన మాట్లాడారు. అధికార కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధికి నయాపైసా రాదని, బీఆర్ఎస్కు వేస్తే వృథాయేనని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటేస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.


