News April 20, 2024
తొలిదశలో ఎన్టీయేకు అనుకూలంగా ఓటింగ్: మోదీ

లోక్సభ తొలి దశ పోలింగ్పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి పోలింగ్లో ఎన్డీఏకు అనుకూలంగా ఏకపక్ష ఓటింగ్ జరిగినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. INDIA కూటమికి నాయకుడెవరో ఆ నేతలు తేల్చుకోలేకపోతున్నారని విమర్శించారు. అమేథీ నుంచి రాహుల్ గాంధీ పారిపోయారని.. ఇప్పుడు వయనాడ్ నుంచి పారిపోతారని చెప్పారు.
Similar News
News March 27, 2026
బ్రేక్ఫాస్ట్ మెనూ రెడీ: 6 రోజులు.. 5 రకాలు

TG: ప్రభుత్వ స్కూళ్లలో 19 లక్షల మంది విద్యార్థుల కోసం ‘CM బ్రేక్ ఫాస్ట్ స్కీమ్’ మెనూను అధికారులు రెడీ చేశారు. దీని కోసం ప్రభుత్వం ₹720 కోట్లు కేటాయించింది. ఈ మెనూ ప్రకారం.. సోమవారం దోశ, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ, బుధవారం పూరీ, గురువారం మిల్లెట్ ఇడ్లీ, శుక్రవారం మిల్లెట్ ఉప్మా/పొంగల్, శనివారం బోండా అందజేస్తారు. అలాగే సోమ, బుధ, శుక్రవారాల్లో పాలు.. మంగళ, గురు, శనివారాల్లో రాగి జావ ఇస్తారు.
News March 27, 2026
ఈ శ్రీరాముడి గుణాలే తారకమంత్రం!

శ్రీరాముడి నాయకత్వ లక్షణాలు నేటికీ ఆదర్శమే. ఎన్ని కష్టాలొచ్చినా నమ్మిన ధర్మాన్ని, విలువలను పక్కనపెట్టలేదు. భరతుడికి కబురు పంపితే రావణుడిపై దండెత్తడానికి మహాసైన్యమే వచ్చేది. కానీ 14ఏళ్ల వనవాసానికి భంగం కలగొద్దని వానరులనే రామదండుగా మార్చుకున్నాడు. ఉన్న వనరులతోనే విజయాలు సాధించొచ్చనడానికి ఇదో ఉదాహరణ. నిజాయతీ, నిబద్ధత, సమానత్వం, సమయపాలన పాటిస్తూ ఏ పని ఎవరికి అప్పగించాలో గ్రహించగలిగే సమర్థుడు రాముడు.
News March 27, 2026
10 లక్షల మందితో గ్రౌండ్ వార్కు ఇరాన్ రెడీ?

అమెరికాతో గ్రౌండ్ వార్ జరిగే ఛాన్స్ ఉందన్న వార్తలతో ఇరాన్ అలర్ట్ అయింది. ఏకంగా 10 లక్షల మంది ఫైటర్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బసిజ్, IRGC రిక్రూట్మెంట్ సెంటర్లకు వాలంటీర్లు భారీగా క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. అటు అమెరికా కూడా తన ఎలైట్ ఫోర్సెస్ను పశ్చిమాసియాకు పంపేందుకు ప్లాన్ చేస్తోంది. ట్రంప్ చర్చల గురించి చెబుతున్నా ఇరాన్ మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తూ యుద్ధానికి సిద్ధమవుతోంది.


