News February 27, 2026
VZM: జిల్లాలో 122 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు

ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి కోరారు. గురువారం అయన ఛాంబర్లో పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లాలో మొత్తం 15,76,018 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 1,847 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. కొత్తగా 122 స్టేషన్లకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. గుర్తింపు పొందిన పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలన్నారు.
Similar News
News April 16, 2026
VZM: ‘జూన్ 15 నాటికి పాస్ పుస్తకాల్లో తప్పులు సరిదిద్దాలి’

రీసర్వే పూర్తయిన, జరుగుతున్న గ్రామాల్లో మ్యుటేషన్స్, సబ్డివిజన్లు పూర్తి చేసి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. గురువారం విజయనగరం కలెక్టరేట్లో అధికారులతో VC ద్వారా సమీక్ష జరిపారు. 423 గ్రామాల్లో పాస్ పుస్తకాల్లో తప్పులను సరిదిద్దుతూ మే 31లోగా ఫారాలు పూర్తి చేసి జూన్ 15 నాటికి పరిష్కరించాలని సూచించారు.
News April 16, 2026
విజయనగరం: సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉద్యోగాల భర్తీ

విజయనగరం సమగ్ర శిక్షా కార్యాలయంలో ఖాళీగా ఉన్న 8 సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO&APC మాణిక్యం నాయుడు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు దీనికి అర్హులన్నారు. ఏప్రిల్ 22 సా.5 గంటల లోపు జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. vizianagaram.ap.gov.in వెబ్సైట్లో సంబధిత వివరాలు ఉన్నాయని చెప్పారు.
News April 16, 2026
విజయనగరంలో రేపు జాబ్ మేళా..

విజయనగరం MR కాలేజీలో ఈనెల 17న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా గురువారం తెలిపారు. ఉ.10.30 గంటలకు ప్రారంభమయ్యే మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్, మెడ్ప్లస్, క్వెస్ కార్ప్, అపోలో ఫార్మసీ సంస్థలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ టు డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై, 18-30 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.12,600-రూ.20,000 పైగా వేతనం లభిస్తుందని తెలిపారు.


