News March 29, 2025
ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రూ.300 నుంచి రూ.307కి పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు రూ.7 పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన వేతనం అమల్లోకి రానుంది.
Similar News
News April 25, 2025
SC గురుకులాల్లో ప్రవేశాలు.. నేటి నుంచి దరఖాస్తులు

TG: రాష్ట్రంలోని 239 ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. మే 15 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఒకేషనల్ కోర్సుల్లో సీట్లు ఉంటాయి. టెన్త్ పరీక్షల్లో మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: https://tgswreis.cgg.gov.in/
News April 25, 2025
వడ్డీ రేట్లు తగ్గించిన మరో 2 బ్యాంకులు

ఇటీవల ఆర్బీఐ రెపో రేటును 0.25% తగ్గించడంతో ఆ మేర రుణ రేటును కుదించనున్నట్లు కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రకటించాయి. దీంతో కెనరా బ్యాంకులో హౌస్ లోన్ కనీస రేటు 7.90%, వాహన రుణ రేటు 8.20% నుంచి ప్రారంభమవుతాయి. ఇండియన్ బ్యాంక్ గృహ రుణ రేటు 7.90%, వెహికల్ లోన్ రేటు 8.25% నుంచి మొదలవుతాయి. ఈ నెల 12 నుంచే ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి.
News April 25, 2025
గెస్ట్ లెక్చరర్ల సర్వీసు పొడిగింపు

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్టు లెక్చరర్ల సర్వీసును ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ నెల 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 18 వరకు సేవలను వినియోగించుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో 957 మందికి లబ్ధి చేకూరనుంది. వేసవి సెలవుల అనంతరం వీరు క్లాస్లు తీసుకోనున్నారు.