News November 17, 2024
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వాల్తేరు DRM

AP: విశాఖ వాల్తేరు DRM సౌరభ్ ప్రసాద్ లంచం తీసుకుంటూ CBIకి పట్టుబడ్డారు. ప్రస్తుతం సెలవులో ఉన్న ఆయన మెకానికల్ బ్రాంచ్ పనుల టెండర్ వ్యవహారంలో ఓ కాంట్రాక్టర్ నుంచి ₹25 లక్షలు డిమాండ్ చేశారు. ముంబైలో ₹10 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా సీబీఐకి దొరికారు. DRMను ప్రస్తుతం CBI విచారిస్తోంది. విశాఖ DRM బంగ్లాలోనూ CBI అధికారులు సోదాలు చేశారు. రైల్వే చరిత్రలో లంచం తీసుకుంటూ పట్టుబడిన 2వ DRM సౌరభ్.
Similar News
News November 18, 2025
ఉలిక్కిపడిన రాష్ట్రం

AP: కొన్నేళ్లుగా మావోయిస్టుల ప్రభావం లేకుండా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం ఇవాళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో అగ్రనేత హిడ్మా హతమవడం, విజయవాడ, కాకినాడలో పెద్ద సంఖ్యలో మావోలను అరెస్టు చేయడం కలకలం రేపింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పెనమలూరులో ఓ బిల్డింగ్ను అద్దెకు తీసుకుని 10 రోజులుగా ఉంటున్నా బయటికి పొక్కకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
News November 18, 2025
ఉలిక్కిపడిన రాష్ట్రం

AP: కొన్నేళ్లుగా మావోయిస్టుల ప్రభావం లేకుండా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం ఇవాళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో అగ్రనేత హిడ్మా హతమవడం, విజయవాడ, కాకినాడలో పెద్ద సంఖ్యలో మావోలను అరెస్టు చేయడం కలకలం రేపింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పెనమలూరులో ఓ బిల్డింగ్ను అద్దెకు తీసుకుని 10 రోజులుగా ఉంటున్నా బయటికి పొక్కకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
News November 18, 2025
‘ఆపరేషన్ కగార్’ దెబ్బ.. ఏపీకి వచ్చి హతమయ్యాడు

AP: మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా హతమవడంతో మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఇటీవల కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో మావోలపై దూకుడు ప్రదర్శిస్తోంది. కర్రెగుట్టల నుంచి అబూజ్మడ్ పర్వతాలు, నేషనల్ పార్కులో జల్లెడ పట్టింది. దీంతో అనేక మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే హిడ్మా తన దళంతో కలిసి మారేడుమిల్లి మీదుగా ఆంధ్రాలోకి ప్రవేశించి ఇవాళ పోలీసుల కాల్పుల్లో మరణించాడు.


