News August 27, 2024

పాకిస్థాన్‌లో ఆడాలని ఉంది: కుల్దీప్ యాదవ్

image

BCCI అనుమతిస్తే పాకిస్థాన్‌లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతామని టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నారు. ‘మేం క్రికెటర్లం కాబట్టి ఏ దేశానికి పంపినా అక్కడ ఆట ఆడతాం. ఇంతకుముందెన్నడూ నేను పాక్‌కు వెళ్లలేదు. అందుకే ఈ టూర్‌ కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అవకాశమిస్తే పాక్ వెళ్లి ఆడుతాం’ అని ఆయన వెల్లడించారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ వెళ్లేదిలేదని BCCI ఇప్పటికే తేల్చిచెప్పింది.

Similar News

News January 16, 2026

HYD: రూ.40K, రూ.లక్ష సాలరీతో ఉద్యోగాలు

image

HYD ECILలో 15 పోస్టులను భర్తీ చేయనుంది. ప్రాజెక్ట్ ఆఫీసర్-C(10), SAP SPECIALIST C(5) పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులకు ఏదైనా డిగ్రీలో 50% ఉత్తీర్ణతతో పాటు పనిలో అనుభవం గల అభ్యర్థులు జనవరి 28, 29 తేదీల్లో ECIL HYDలో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఎలాంటి అప్లికేషన్, ఫీజు లేదు. ప్రాజెక్ట్ ఆఫీసర్‌లకు నెలకు రూ.40,000, SAP స్పెషలిస్ట్‌కు రూ.1,25,000 జీతం ఉంటుంది. వివరాలకు <>https://www.ecil.co.in/<<>>లో చూడండి.

News January 16, 2026

12,000 మంది మృతి.. ఎక్కడికక్కడ శవాల గుట్టలు!

image

ఇరాన్‌లో జరిగిన నిరసనల్లో 12 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మెషీన్ గన్లతో పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపారనే ఆరోపణలు వస్తున్నాయి. వందల మృతదేహాలు ఉన్న ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. చనిపోయిన వారిని కుటుంబ సభ్యులు తీసుకెళ్లాలని లేదంటే సామూహిక సమాధి చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నిన్నటి నుంచి కాల్పులు ఆగినట్లు US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.

News January 16, 2026

రేపు కాకినాడ.. ఎల్లుండి అమరావతిలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపు కాకినాడలో పర్యటించి అమ్మోనియం ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఎల్లుండి ఆయన అమరావతిలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. ఈ నెల 19న సీఎం దావోస్ పర్యటనకు వెళ్తారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ టూర్ ఉండనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం స్వగ్రామం నారావారిపల్లెలో ఉన్న విషయం తెలిసిందే.